బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ సినిమా చూశాక అందరికి ఒకటే ఆలోచన. ఈ సినిమా తెలుగులో ఏ హీరో చేస్తే బావుంటుందా అని. చాలా మంది విక్టరీ వెంకటేష్ చేస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు. బాలయ్య ఫ్యాన్స్ కూడా బాలీవుడ్ పింక్ రీమేక్ లో అమితాబ్ పాత్రలో బాలయ్య ని చూడాలనుకున్నారు. ఆ తర్వాత నాగార్జున.. ఇలా సీనియర్ హీరోల పేర్లు బాగానే ప్రచారం అయ్యాయి. ఈ లోపు ఇదే కథ కోలీవుడ్ కి వెళ్ళడం.. అక్కడ అజిత్ నటించి హిట్ కొట్టడం జరిగిపోయాయి.
బాలీవుడ్.. కోలీవుడ్ లో ఈ కథ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రెండు భాషల్లోను 100 కోట్ల కి పైగానే వసూళ్ళని రాబట్టింది. అయితే ఈ కథ టాలీవుడ్ లో పవర్ స్టార్ చేస్తాడని మాత్రం ఎవరూ భావించలేదు. కోలీవుడ్ లో నిర్మించిన బోనీ కపూర్ సమర్పణలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు పవర్ స్టార్ రీ ఎంట్రీ సినిమాగా పింక్ రీమేక్ రూపొందబోతుందనగానే దేశ వ్యాప్తంగా ప్రేక్షకులకి పట్టరాని ఆనందం కలిగింది.
రాజకీయాలలోకి వెళ్ళిన పవర్ స్టార్ ఇలా యూ టర్న్ తీసుకొని వకీల్ సాబ్ రూపంలో వస్తాడని ఊహించని ప్రతీ ఒక్కరికి సర్ప్రైజ్ అదిరిపోయింది. మొత్తానికి ఈ సినిమా దాదాపు కంప్లీట్ అయింది. దాంతో మేకర్స్ ఈ సినిమా టీజర్ ని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఆ టీజర్ మామూలుగా ఉండదని అంటున్నారు. బాలీవుడ్, కోలీవుడ్ కంటే ధీటుగా ఈ సినిమాని రూపొందించాడు దర్శకుడు వేణు శ్రీరాం. కాగా ప్రమోషన్స్ ని మొదలు పెట్టాలన్న ఉద్దేశ్యంతో ముందు అదిరిపోయో టీజర్ ని రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. ఆ టీజర్ కి దీపావళి పండుగ రోజు ఫిక్స్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు సమాచారం.