బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అయిదవ విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర వాయిదా పడింది. ఈ నెల 15వ తేదీ నుండి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటికే అయిదవ విడత పాదయాత్రకు సంబంధించి రోడ్ మ్యాప్ ను పార్టీ ప్రకటించింది. అయితే మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నేడు షెడ్యుల్ విడుదల చేసిన నేపథ్యంలో బండి సంజయ్ తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. ఈ నెల 7వ తేదీ మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కానుండగా నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరగనుంది. 6వ తేదీ ఓట్ల లెక్కింపు ఫలితాలు వెల్లడి జరగనుంది. ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికల పూర్తి అయిన తర్వాత అయిదవ విడద పాదయాత్ర చేయాలని నిర్ణయానికి వచ్చారు. అందుకే ఈ నెల 15వ తేదీ నుండి జరగాల్సిన పాదయాత్రను వాయిదా వేసుకున్నారు.
ఇప్పటి వరకూ బండి సంజయ్ నాలుగు విడతలుగా పాదయాత్ర పూర్తి చేశారు. తన పాదయాత్ర ప్రారంభ, ముగింపు సందర్బంగా ఏర్పాటు చేస్తున్న సభల్లో బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకులు, కేంద్ర మంత్రులు పాల్గొంటుండటంతో ఆ పాార్టీ శ్రేణుల్లో జోష్ వస్తొంది. మరో పక్క బండి సంజయ్ పాదయాత్రకు మంచి స్పందన వస్తొంది. ఈ క్రమంలో బండి సంజయ్ పాదయాత్రలో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య అక్కడక్కడా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కారణంగా బండి సంజయ్ నాల్గవ విడత పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించగా, హైకోర్టును ఆశ్రయించి సక్సెస్ అయ్యింది బీజేపీ. 2023 అసెంబ్లీ ఎన్నికల లోపుగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర పూర్తి చేయాలని బండి సంజయ్ ప్లాన్ చేసుకున్నారు. పాదయాత్ర ద్వారా పార్టీ బలోపేతం చేయాలన్న సంకల్పంతో బండి సంజయ్ ముందుకు సాగుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా వాయిదా పడిన బండి సంజయ్ పాదయాత్ర మళ్లీ ఎప్పుడు ప్రారంభం అయ్యేది త్వరలో ప్రకటిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు ఎన్నికల షెడ్యుల్ విడుదల అయిన నేపథ్యంలో బీజేపీ కీలక నేతలు అందరూ రేపటి నుండి మునుగోడులో మకాం వేయనున్నారు. బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయనున్నారు.
Breaking: మునుగోడు ఉప ఎన్నికల షెడ్యుల్ ప్రకటించిన ఈసీ