కుండపోత వర్షాల వల్ల హైదరాబాద్ నగరం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. వరదలు ఇళ్లల్లోకి దాదాపు నడుము లోతు రావటంతో..నగర ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరదల వల్ల చాలా ఇల్లు అదేవిధంగా కార్లు మోటర్ బైకులు కొట్టుకుపోయిన విజువల్స్ అప్పట్లో వచ్చాయి. అంతేకాకుండా చాలా మంది వరదల్లో మనుషులు కూడా కొట్టుకుపోయారు.
కాగా అధికారంలో ఉన్న టిఆర్ఎస్ మాత్రం వరద బాధితుల విషయంలో పెద్దగా స్పందించలేదన్న టాక్ ప్రజల నుండి అప్పట్లో బలంగా వచ్చింది. పరిస్థితి ఇలా ఉండగా కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ ఈ వరద సాయం కింద ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంటూ టిఆర్ఎస్ శ్రేణులు ఆరోపణలు చేయడం మనకందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా గ్రేటర్ ఎన్నికల విషయంలో ఎలాగైనా విజయం సాధించాలని మంచి దూకుడు మీద ఉన్న బిజెపి వరద బాధితులకు సరి కొత్త ఆఫర్లు ఇస్తోంది.
తాజాగా బండి సంజయ్ నిర్వహించిన మీడియా సమావేశంలో.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల లో బిజెపి అభ్యర్థిని గెలిపిస్తే మేయర్ పీఠాన్ని బిజెపికి వచ్చేలా చేస్తే..వరద బాధితులకు ఇంటికి 20 వేల రూపాయల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా వరదల్లో ఇల్లుపోతే ఇల్లు, బైక్ పోతే బైక్… కారుపోతే కారు ఇస్తామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎంఐఎం పార్టీతో సంబంధాలు ఉన్నాయి అంటే ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లే అంటూ బండి సంజయ్ ధ్వజమెత్తారు. కచ్చితంగా గ్రేటర్ ఎన్నికల్లో బిజెపి పార్టీ గెలవటం గ్యారెంటీ అని స్పష్టం చేశారు. మరోపక్క టిఆర్ఎస్ పార్టీ తరఫున గ్రేటర్ ఎన్నికల బాధ్యతలు తీసుకున్న మంత్రి కేటీఆర్ మరోసారి కూడా మేయర్ పీఠం టీఆర్ఎస్ దేనని..ఓల్డ్ సిటీ లో కూడా పది సీట్లు టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. మతం పేరుతో నగరంలో వివాదాలు సృష్టిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని కరాఖండిగా చెప్పారు.