న్యూఢిల్లీ: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కె.కేశవరావు (కేకే)కు ఎక్స్ అఫిషియో ఓటు హక్కు కల్పించారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఇతర బీజేపీ నేతలు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడిని కలిసి ఫిర్యాదు చేశారు. కేకే వ్యవహారాన్ని రాజ్యసభ ఎథిక్స్ కమిటీ ముందుకు తీసుకెళ్లాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కేకేపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లక్ష్మణ్ తో పాటు వెంకయ్యనాయుడిని కలిసిన వారిలో ఎంపీలు ధర్మపురి అరవింద్, బండి సంజయ్ తదితరులున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిందని బీజేపీ నేతలు మండిపడ్డారు.
తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో నిబంధనలకు విరుద్ధంగా ఓటు వేసిన రాజ్యసభ సభ్యుడు కే.కేశవ రావు ఉదంతాన్ని రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు దృష్టికి తీసుకెళ్తూ వినతిపత్రం సమర్పించిన రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ నేతృత్వంలోని బిజెపి తెలంగాణ ప్రతినిధి బృందం pic.twitter.com/xaW76ZGQbA
— BJP Telangana (@BJP4Telangana) February 1, 2020