KCR: అందరూ ఊహించినట్లుగానే ముఖ్యమంత్రి కేసిఆర్ .. స్వచ్చంద పదవీ విరమణ చేసిన సీనియర్ ఐఏఎస్ సోమేష్ కుమార్ కు కీలక పదవి ఇచ్చారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి వదులుకొని ఏపి కేడర్ కు వెళ్లి జాయిన్ అయిన సోమేష్ కుమార్ కు అక్కడి ప్రభుత్వం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. జీఏడీలో రిపోర్టు చేసిన రోజులు గడిచినా ఆయనకు పోస్టింగ్ ఇవ్వకపోవడంతో స్వచ్చంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకోవడంతో ఏపి సర్కార్ ఆమోదించింది. ఆ తర్వాత ఆయన పదవీ విరమణను కేంద్రం ఆమోదించింది.
ఈ నేపథ్యంలో కేబినెట్ హోదాతో కూడిన ప్రధాన సలహాదారుడిగా ముఖ్యమంత్రి కేసిఆర్ ఆయనను నియమించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సోమేష్ కుమార్ మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇటీవల జరిగిన బీఆర్ఎస్ మహాసభకు సోమేష్ కుమార్ హజరు కావడంతో ఆయనకు ప్రభుత్వంలో కీలక పదవి లభిస్తుందని ప్రచారం జరిగింది. ఆ మేరకు సోమేష్ కుమార్ కు ప్రధాన సలహాదారు పదవిని కేసిఆర్ ఇచ్చారు.
CM YS Jagan: మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ సీఎం వైఎస్ జగన్
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?