తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు కరోనా పాజిటివ్ రావడం ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఆయనతోపాటు కుమారుడికి కూడా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన నిన్నిటి నుంచే క్వారంటైన్ ఉన్నట్టు సమాచారం. మిగిలిన కుటుంబసభ్యులకు నెగటివ్ రావడంతో వారంతా హోం క్వారంటైన్ లో ఉన్నారు.
ఇప్పటికే హోంమంత్రికి కరోనా సోకగా ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని సమాచారం. తెలంగాణలో ఇప్పటికే 15,394 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 975 కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇప్పటికే ప్రజాప్రతినిధుల్లో ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా సోకిన విషయం తెలిసిందే.