Telangana Formation day celebrations: కరోనా పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నేడు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ప్రగతి భవన్ లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి కేసిఆర్ పాల్గొని జెండా ఎగురవేసి వందనం చేశారు. తొలుత గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లి కేసిఆర్ నివాళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. సిరిసిల్లలో మంత్రి కేటిఆర్, సిద్ధిపేటలో మంత్రి హరీశ్ రావు జాతీయ జెండా ఎగురవేశారు. స్థానికంగా ఉన్న అమరవీరుల స్తూపాల వద్ద మంత్రులు నివాళులర్పించారు.
Read More: CBSE Class 12 Exams: పిఎం మోడీ కీలక నిర్ణయం..జగన్కు షాక్..!!
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఘనమైన చరిత్ర, విశిష్ట సంస్కృతులకు తెలంగాణ నిలయమని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర సహజ వనరులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులను కలిగి ఉందని కొనియాడారు. తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతి, స్వయం సమృద్ధి సాధించాలని కోరుతున్నట్లు వెంకయ్య చెప్పారు. దేశంలో తన వంతు పాత్రను రాష్ట్రం కొనసాగించాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు.
కాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన ట్వీట్ లో రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు విభిన్న సంస్కృతితో అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్యరాజన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Best wishes to the people of Telangana on the state’s Formation Day. The state is blessed with a unique culture and hardworking people who have excelled in many areas. Praying for the good health and well-being of the people of Telangana.
— Narendra Modi (@narendramodi) June 2, 2021