కరోనా వైరస్ రోగులను ప్రైవేట్ ఆసుపత్రులు చికిత్స అందిస్తున్న విధానం…. అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్న తీరు పట్ల హై కోర్టు తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అసలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పేద వారికి ఉచితంగా చికిత్స చేస్తున్నారా లేదా అని ప్రశ్నించడం గమనార్హం.
అలాగే ప్రైవేట్ ఆసుపత్రులు అన్నీ ముందే కరోనా చికిత్సకు ముందు ఒక ఫీజును నిర్దేశించాలి అని…. అందుకు తగ్గట్లు వారు నడుచుకోకపోతే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక ఆ తర్వాత అత్యవసరంగా ప్రభుత్వంతో చర్చించి…. ప్రైవేట్ ఆసుపత్రులు తమ ఆసుపత్రిలో యాభై శాతం బెడ్లను ప్రభుత్వం వారి ఆధీనంలోనే ఉంచి చికిత్స జరిపేందుకు సహకరిస్తామని ప్రకటించడం విశేషం.
ఈ లెక్కన ఇక పై ప్రైవేట్ ఆస్పత్రిలో 50% బెడ్లు పేషెంట్లకు ఉచితంగా కరోనా చికిత్సకు అందించబడుతుంది. దీనిని మొత్తం ప్రభుత్వం పర్యవేక్షించి… చికిత్స మొత్తం ఉచితంగానే చేస్తారన్నమాట. ఇకపోతే ఇందుకు సంబంధించిన కార్యాచరణ.. ఫార్మాలిటీలు అన్నీ రేపటికి పూర్తవుతాయి