ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చినట్లు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. సరిగ్గా పాజిటివ్ రిపోర్ట్ రాకముందు రెండు రోజులు చిరంజీవి కేసీఆర్ తో భేటీ అవ్వటం కోసం నాగార్జునతో కలిసి వెళ్లడం జరిగింది. ఆ సమయంలో నాగార్జున, చిరంజీవి మాస్కు పెట్టుకొన్నట్లు ఫోటోలో కనబడటంతో చిరంజీవికి పాజిటివ్ అని తెలియగానే టిఆర్ఎస్ పార్టీ నేతలు అదేవిధంగా నాగార్జున అభిమానులు తెగ కంగారు పడిపోయారు.
అయితే తనకు పాజిటివ్ వచ్చింది అని తెలియగానే చిరంజీవి హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లినట్లు తనతో కాంటాక్ట్ అయిన ప్రతి ఒక్కరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని సూచించడం జరిగింది. ఇదిలా ఉండగా ఎలాంటి లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్ రావటంతో అనుమానం వచ్చి మరికొన్ని చోట్ల చిరంజీవి కరోనా పరీక్షలు చేయించుకోగా అనూహ్యంగా రిపోర్టులు నెగెటివ్ రావడం అందరికీ షాక్ గురిచేసింది.
ఇదిలా ఉండగా ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపిన చిరంజీవి తర్వాత గురువు అయిన విశ్వనాథ్ ఇంటికి స్వయంగా వెళ్లి ఆయనను కౌగిలించుకొని ఆత్మీయత చాటుకున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఒక్కసారి కరోనా పాజిటివ్ వచ్చి ఆ తర్వాత నెగెటివ్ అని వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం చిరంజీవి క్వారంటైన్ లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం ఇది తప్పనిసరిగా ఫాలో అవ్వాలని క్వారంటైన్ లో ఉండాల్సిందేనని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. అంతే కాకుండా ఎలాంటి కరోనా నిర్ధారణ పరీక్ష కూడా నూటికి నూరు శాతం కచ్చితత్వంతో రిజల్ట్ రాదని స్పష్టం చేశారు. దీంతో క్వారంటైన్ లోకి వెళ్లి పోవాలి అని చిరంజీవికి సూచించారు.