మహమ్మారి కరోనా వైరస్ కారణంగా దేశంలో అన్ని రాష్ట్రాలకు ఖజానాకు భారీ స్థాయిలో నష్టాలు రావటం జరిగాయి. ఇదే రీతిలో తెలంగాణ ఖజానా కూడా నష్టపోడం జరిగింది. ముఖ్యంగా దేశంలో వైరస్ ప్రవేశించిన తరువాత తెలంగాణ ఖజానాకి ఆయువు పట్టు అయిన హైదరాబాద్ ప్రాంతంలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో.. అధిక శాతం రాబడి వచ్చే తెలంగాణ ఖజానాకి గండి పడినట్లయింది. వాణిజ్య వ్యాపారాలు అన్ని క్లోజ్ అయిపోవడంతో పాటు ప్రజలంతా లాక్ డౌన్ దెబ్బకి ఇళ్లలోనే ఉండిపోవడం జరిగింది.
చాలామంది రోడ్డు మీద ఉండే ప్రజలు మరియు పేదవాళ్ళు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి తరుణంలో సినీ రాజకీయ ప్రముఖులు అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు లాక్ డౌన్ సమయంలో ప్రజలను ఆదుకోవడానికి ముందుకు వచ్చే అనేక సహాయ కార్యక్రమాలు చేయడం జరిగింది. తెలంగాణలో ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. మెట్రో కూడా ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత మెట్రో పునఃప్రారంభించడానికి తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకున్నా గాని.. భారీ వర్షాల కారణంగా మెట్రోరైలు మొదలైన కొద్ది రోజులకే సర్వీసులు తెలంగాణ ప్రభుత్వం ఆపేసింది.
అయితే మళ్లీ స్టార్ట్ చేసే అవకాశం ఉన్న ఈ తరుణంలో ప్రజలను ఆకర్షించడానికి మెట్రో ప్రయాణికులకు భారీ డిస్కౌంట్ ఆఫర్లను తెలంగాణ సర్కార్ ప్రకటిస్తుంది. మెట్రో సువర్ణ ఆఫర్ పేరుతో అప్ టు 40 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ను పాసింజర్ లకు అందిస్తున్నట్టుగా… హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ ఆఫర్లు అక్టోబర్ 17 నుంచి వర్తించనున్నాయట.
7 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే .. 30 రోజుల్లో 10 ట్రిప్పులు తిరిగే అవకాశం
14 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే ..45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం
20 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే …45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం
30 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే… 45 రోజుల్లో 45 ట్రిప్పులు తిరిగే అవకాశం
40 ట్రిప్పులకు చార్జీ చెల్లిస్తే.. 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరగవచ్చునని అధికారులు వెల్లడించారు