Telangana Governer : తెలంగాణకు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్… ప్రతి పనిలో తన మార్క్ చూపిస్తున్నారు.
ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్టు కనిపిస్తోంది ఇందులో భాగంగానే ఆమె తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. గవర్నర్ గా రాకముందు తమిళనాడులో బీజేపీ పక్షాన అగ్రనాయకురాలు గా ఉన్న ఆమె ప్రజలతో మమేకమై పని చేశారు.ఇప్పుడు గవర్నర్ గా ఉన్నప్పటికీ ప్రజలతో సంబంధాలు పెట్టుకుంటేనే ఆ పదవికి ,తనకు కూడా ఫేస్ వ్యాల్యూ వస్తుందని ఆమె భావిస్తున్నారు.ఈ మధ్య కాలంలో అదే పనిలో ఉన్నారు.ఇప్పుడు ఇంకాస్త ముందుకెళ్లి ప్రతి రోజూ పేదలకు రాజ్ భవన్ భోజనం అందించాలని తాజాగా నిర్ణయించారు. సోమవారం నుండి ఇందులో భాగంగా సోమాజీగూడలోని రాజ్భవన్లో ఈ స్కీంను అమలు చేయనున్నారు. ఈ పథకం ద్వారా రాజ్భవన్ ఆవరణలో రోజూ పేదలకు రెండుపూటలా భోజనం పెడతారు. మధ్యాహ్నం, రాత్రి సమయంలో పేదవారు ఈ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ విధంగా తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ తన మంచి మనసును చాటుకున్నారు. గవర్నర్గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంగా కొత్త పథకాన్ని ప్రకటించారు. రాజ్భవన్ అన్నం పేరుతో ఒక పథకాన్ని ఈ మధ్యాహ్నం గవర్నర్ తమిళసై స్వయంగా ప్రారంభించారు .
Telangana Governer : ఉచిత భోజనం కాదా?
అయితే, ఇది ఉచిత భోజన సదుపాయం కాదని రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. కొద్ది మొత్తంలో డబ్బు చెల్లించి తినవచ్చని తెలిపారు. ప్రతి రోజూ 500 మందికి తక్కువ ఛార్జీతో భోజనం పెట్టేలా దీన్ని రూపొందించినట్లు రాజ్ భవన్ అధికారులు తెలిపారు. ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో ఈ కార్యక్రమం పేదలకు మేలు చేస్తుందని భావిస్తున్నారు. రాజ్భవన్లో ఈ పథకం అమలు చేస్తున్నందున.. భోజనం, కూరల విషయంలో కచ్చితంగా నాణ్యత పాటిస్తారని చెబుతున్నారు.
ఇదేమైనా పోటీ పథకమా?
ఇదిలావుంటే, తెలంగాణ వ్యాప్తంగా రూ.5 భోజనం పథకాన్ని అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇలాంటి సమయంలో గవర్నర్ తమిళిసై తాజాగా ఆమె ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె మున్ముందు ఇంకెలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనే అంశం హాట్ టాపిక్ అవుతోంది.