తెలంగాణ గవర్నర్ తమిళి సై ఢిల్లీకి చేరుకున్నారు. తమిళి సై చెన్నై నుండి నేరుగా ఢిల్లీకి వెళ్లారు. తమిళి సై తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో పాటు మరి కొందరు కేంద్ర మంత్రులను కలవనున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. తెలంగాణకు సంబంధించి పలు అంశాలపై అమిత్ షాతో తమిళి సై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తొంది. తెలంగాణలో రాజ్ భవన్, ప్రగతి భవన్ మద్య తీవ్ర స్థాయిలో విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రోటోకాల్ ఉల్లంఘనలు, అసెంబ్లీ ఆమోదించిన తర్వాత తన వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులు తదితర విషయాలపైనా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. తెలంగాణలో రోజురోజుకు రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. గవర్నర్ తమిళి సైని బీఆర్ఎస్ నేతలు బీజేపీ నాయకురాలిగా భావిస్తూ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ వ్యూహత్మకంగా పావులు కదుపుతున్నది. ఈ తరుణంలో గవర్నర్ తమిళి సై ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
సివిల్ సప్లైస్ కార్పోరేషన్ కుంభకోణం కేసులో మహిళా ఆర్డీఓ అరెస్టు