ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు 2.73 శాతం డీఏ మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 జూలై 1 నుండి డీఏ చెల్లించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
అయితే 2021 జూలై నుండి 2022 డిసెంబర్ వరకూ ఉన్నడీఏ బకాయిలను ఎనిమిది విడతల్లో చెల్లించనున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. కాగా ప్రస్తుతం ఒక డీఏ ను మాత్రమే మంజూరు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటించిన డీఏ నగదును జనవరి ఫించన్ తో కలిపి ఫింఛనుదారులకు ఫిబ్రవరిలో చెల్లించనున్నట్లు తెలిపింది. డీఏ పెంపు నిర్ణయంతో రాష్ట్రంలోని 4.4 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 2.88 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.
AP High Court: జీవో నెం.1 పై విచారణ రేపటికి వాయిదా.. అత్యవసర విచారణ జరపడంపై సీజే ఘాటు వ్యాఖ్యలు