వాన్పిక్ ప్రాజెక్టు లిమిటెడ్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ చెల్లదని హైకోర్టు తెలిపింది. వైఎస్ఆర్ హయాంలో ఉమ్మడి ఏపిలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటునకు గానూ వాక్పిక్ ప్రాజెక్ట్స్ కు గుంటూరు, ప్రకాశం జిల్లాలో 12,293 ఎకరాల భూముల కేటాయింపు జరిగింది. వాన్పిప్ ఫోర్ట్స్ ప్రాజెక్టు పేరుతో సొంత వాటా అధికంగా ఉన్న వాన్సిప్ ప్రాజెక్టు లిమిటెడ్ కు భూ కేటాయింపులు, రాయితీలు కల్పించారని సీబీఐ ఆరోపించింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా భూకేటాయింపులు చేయడంతో పాటు ప్రాజెక్టులో రాక్ వాటా తగ్గింపు సహా అన్ని జరిగాయని అభియోగాలు మోపింది.
నిబంధనలకు విరుద్దంగా భూకేటాయింపులు, కొనుగోళ్లు జరిగాయని రాక్ నుండి ప్రాజెక్టు నిమిత్తం వచ్చిన నిధులు మళ్లించారని ఆరోపించింది. హైదరాబాద్ సీబీఐ కోర్టులో సీబీఐ అధికారులు చార్జిషీటు దాఖలు చేశారు. సీబీఐ చార్జిషీటు చెల్లదంటూ తెలంగాణ హైకోర్టులో వాన్ పిక్ ప్రాజెక్ట్స్ క్వాష్ పిటిషన్ ను దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం.. సీబీఐ అభియోగాలను కొట్టివేస్తూ క్వాష్ పిటిషన్ కు అనుమతి ఇచ్చింది. దీంతో వాన్ పిక్ కు ఊరట లభించినట్లు అయ్యింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?