వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన వేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టేసింది. ఏపి ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ పిర్యాదు మేరకు రఘురామ, ఆయన కుమారుడు భరత్, పీఎ శాస్త్రి మరో ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బందిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే.
విధి నిర్వహణలో ఉన్న తనపై నలుగురు వ్యక్తులు కారులో ఎక్కించుకుని ఎంపి రఘురామ ఇంట్లోకి తీసుకువెళ్లి చిత్ర హింసలకు గురి చేశారని ఏపి ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ బాషా పిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు అయ్యింది. ఈ ఫిర్యాదు నేపథ్యలో సిఆర్పిఎఫ్ సిబ్బందిని ఉన్నతాధికారులు సస్పెండ్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో గచ్చిబౌలి పోలీసులు తమ పై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ రఘురామ, ఆయన తనయుడు భరత్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకోగా ధర్మాసనం దాన్ని కొట్టివేసింది.