సచివాలయం కూల్చివేతకు అడ్డం పడుతున్న పిటీషన్ లను ఇవాళ తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది. ఇప్పటికే 80 శాతం కూల్చివేత పూర్తయింది. ఇక ఈరోజు ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ రావడంతో పనులు మరింత వేగవంతం కానున్నాయి.
సచివాలయం కూల్చివేతను వ్యతిరేకిస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెల్సిందే. ఆ కూల్చివేతకు పర్యావరణ అనుమతులు కావాలని పిటీషన్ లో పేర్కొనగా, హైకోర్టు వాటిని తోసిపుచ్చింది. సచివాలయం నిర్మూలనకు ఎటువంటి అనుమతులు అవసరం లేదని తేల్చి చెప్పింది. కూల్చివేతలకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్ లు అన్నిటినీ కొట్టిపారేసింది. క్యాబినెట్ నిర్ణయాన్ని సమర్ధించింది. దీంతో సచివాలయ నిర్మూలనపై ఏర్పడిన సందిగ్దత వీడినట్లైంది.