జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు నేపథ్యంలో బ్యాలెట్పై పెన్నుతో టిక్ చేసినా ఓటు చెల్లుబాటు అవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులను తప్పుబడుతూ బీజెపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ నిర్వహించిన హైకోర్టు ధర్మాసనం ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. దీంతో హైకోర్టులో బీజెపీకి ఊరట లభించినట్లు అయ్యింది.
ఎన్నికల నిబంధనల ప్రకారం బ్యాలెట్ పై స్వస్తిక్ ముద్ర ఉన్న ఓట్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. నిన్న రాత్రి రాష్ట్ర ఎన్నికల సంఘం బ్యాలెట్ పేపరు పై పెన్నుతో టిక్ పెట్టినా ఓటు వేసినట్లేనని ఉత్తర్వులు జారీ చేయడం వివాదాస్పదం అయ్యింది. దీనిపై బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై, ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.