తెలంగాణ రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖలో ఉన్నతాధికారి అదే శాఖలో పనిచేసే మహిళా సీఐ కి పెద్ద కీచకుడిగా మారాడు. తోటి మహిళా ఉద్యోగి అని ఆలోచించకుండా పెళ్లి అయ్యి భర్త ఉండి, ఒక పాప కూడా ఉన్న ఆమెకి అసభ్యకరమైన మెసేజ్ లు పెడుతూ తానున్న క్వార్టర్స్ పక్కన ఉండాలని తేగా వేధిస్తున్నాడంట. దీంతో ఆమె మీడియా ముందుకు వచ్చి తన బాధంతా చెప్పుకోవడం తో తెలంగాణలో ఆ అమ్మాయే ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది.
పూర్తి వివరాల్లోకి వెళితే భూపాలపల్లి ఎక్సైజ్ సూపర్డెంట్ అదే శాఖలో పనిచేస్తున్న మహిళా సీఐ ప్రశాంతి వెల్లడించిన వైనం ఈ విధంగా ఉంది. భూపాలపల్లి ఎక్సైజ్ సూపరిటెండెంట్ రోజు వాట్సాప్ లో అసభ్యకరమైన మెసేజ్ లు పెడుతున్నారు అని… తానుండే క్వార్టర్ పక్కనే క్వార్టర్ ఇప్పిస్తానని.. అక్కడే ఉండి డ్యూటీ చేయాలని ఇబ్బంది పెడుతున్నట్లు ఆరోపించింది. తన కోరిక తీరిస్తే భూపాలపల్లి ఇన్ చార్జి సీఐ పోస్టు కూడా ఇప్పిస్తానంటూ ఒత్తిడి తెస్తున్న వైనాన్ని ఆమె బయటపెట్టారు. తనకు పెళ్లి అయిందని పిల్లలు ఉన్నారని చెబుతున్నా భయంకరంగా వేధిస్తున్నాడని మహిళా సీఐ ప్రశాంతి తెలిపింది. ఈ సందర్భంగా భూపాలపల్లి కలెక్టర్ కి సదరు కీచకుడి పై ఫిర్యాదు చేయడం జరిగింది.