తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి చెందిన మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీపై న్యాక్ కొరడా ఝళిపించింది. తప్పుడు పత్రాలతో న్యాక్ గ్రేడ్ కోసం మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ దరఖాస్తు చేసుకుంది.
దీన్ని గమనించిన న్యాక్.. ఐదేళ్లపాటు గ్రేడ్కు అప్లై చేసుకోకుండా మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీపై నిషేధం విధించింది. ఈ మేరకు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్-న్యాక్ నోటీసులు జారీ చేసింది.మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ రాష్ట్రమంత్రి మల్లారెడ్డికి సంబంధించింది కావడంతో ఇప్పుడు
రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కొద్ది రోజుల క్రితమే మల్లారెడ్డి యూనివర్సిటీ
మంజూరయ్యే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు విద్యార్థులు విద్యావేత్తల్లోగానీ, రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లోగానీ మల్లారెడ్డి, మల్లారెడ్డి విద్యా సంస్థలు చర్చనీయాంశం అయ్యాయి.
అతిపెద్ద ఛెయిన్ గ్రూప్!
ప్రధానంగా ఎంబీఏ, ఎంసీఏ, ఇంజనీరింగ్, మెడికల్ కు సంబంధించి దాదాపు 20 కాలేజీలు మల్లారెడ్డికి సంబంధించినవి ఉన్నాయి. ఇందులో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ఎమ్ ఆర్ ఐటీకి సంబంధించిన క్యాంపస్-1 దూలపెళ్లి రోడ్, మైసమ్మగూడ అడ్రస్ కల్గిన మాల్లారెడ్డి ఇంజనీరింగ్
ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారు.
అసలేం జరిగింది?
5-11-2019 న తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించారు. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దానిపై స్పందించకపోవడంతో మరోసారి రిఫర్ చేశారు. దీనిపై మీరు దృష్టి పెట్టాలి..ఇప్పటికే మీకు షోకాజ్ నోటీసులు ఇచ్చాం…ఏం చేశారంటూ కూడా
న్యాక్ అడిగింది. కానీ దానికి రిప్లై ఇవ్వకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఐదు సంవత్సరాల పాటు న్యాక్ గ్రేడ్ కు అప్లై చేసుకునేందుకు అవకాశం లేకుండా మల్లారెడ్డి ఇంజనీరింగ్ పై నిషేధం విధించారు.దీంతో ఆ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు, చేరాలనుకుంటున్నవారు కూడా ఆందోళనకు గురవుతున్నారు.