తెలంగాణ మంత్రి కేటిఆర్ ఈ రోజు జారి పడ్డారు. దీంతో ఆయన ఎడమ కాలి మడమకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆయన పరీక్షలు చేయించుకోగా వైద్యులు ఫ్రాక్చర్ అయినట్లు గుర్తించి కట్టు కట్టారు. మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ విషయాన్ని మంత్రి కేటిఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఎడమ కాలి మడమకు చిన్న పాటి ఫ్రాక్చర్ కావడంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తనకు ఈ మూడు వారాల పాటు ఓటీటీలో మంచి సినిమాలు చూసేందుకు పేర్లు సూచించాలని నెటిజన్ లను కోరారు. కాగా రేపు మంత్రి కేటిఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా కేటిఆర్ అభిమానులు, టీఆర్ఎస్ శ్రేణులు కేటిఆర్ పుట్టిన రోజు వేడుకలను హంగామాగా చేసే అవకాశం ఉన్నందున వారికి సూచనలు చేశారు. తన పుట్టిన రోజు వేడుకలకు హాంగామా చేయవద్దని కేటిఆర్ సూచించడంతో పాటు తనపై అభిమానం ఉన్న వాళ్లు వరద బాధితులను ఆదుకోవాలని కోరారు. వరద బాధితులకు సాయం చేసి వారిని ఆదుకుంటే అదే తనకు ఆనందమని కేటిఆర్ పేర్కొన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?