కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు తెలంగాణ మంత్రి కేటిఆర్ కీలక విజ్ఞప్తి చేశారు. సీఆర్పీఎఫ్ ఉద్యోగాలకు కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ లో హిందీ, ఆంగ్ల మాథ్యమాల్లోనే పరీక్ష నిర్వహిస్తామని పేర్కొనడంపై మంత్రి కేటిఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని వల్ల కోట్లాది మంది హిందీయేతర ప్రాంత నివాసిత నిరుద్యోగ యువకులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి కేటిఆర్.. రాజ్యాంగం గుర్తించిన అన్ని అధికార భాషల్లోనూ పరీక్ష నిర్వహించాలని అమిత్ షాను కోరారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు తెలుగు సహా ఇతర ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష రాసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ.. ఈ మేరకు సీఆర్పీఎఫ్ నోటిఫికేషన్ సవరించాలని లేఖ రాశారు.
సీఆర్పీఎఫ్ ఉద్యోగ సిబ్బంది నియామకం కోసం చేపడుతున్న ఈ పరీక్షను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు అన్ని అధికారిక భాషల్లో నిర్వహించాలని కేంద్రాన్ని కేటిఆర్ డిమాండ్ చేశారు. కేవలం హిందీ, ఆంగ్లం భాషల్లోనే నిర్వహిస్తే తీవ్ర వివక్షత ఏర్పడుతుందని, ఆంగ్ల మాథ్యమంలో చదవని వారు, హిందీ ప్రాంతాలకు చెందని నిరుద్యోగ యువకులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. వివిధ ఉద్యోగాల కోసం అనేక పరీక్షలు నిర్వహించే బదులు, నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజన్సీ ద్వారా ఉమ్మడి అర్హతా పరీక్ష విధానంలో 12 అధికారిక భాషల్లో పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా కేటిఆర్ గుర్తు చేశారు. అయితే ఈ నిర్ణయం సంపూర్ణంగా అమలు కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన పెనుప్రమాదం .. రన్నింగ్ బస్సు నుండి మంటలు..ఎక్కడంటే..?