Aanandhayya: కృష్ణపట్నం ఆనందయ్య మందు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశం మొత్తం మీద కూడా ట్రెండింగ్ టాపిక్.కరోనా నిరోధానికే కాకుండా ఆ వ్యాధి సోకిన వారికి చికిత్సకు కూడా ఈ మందును ఇస్తుండటం, అది సత్ఫలితాలనివ్వడం అందరికీ తెలిసిందే.
దాదాపు ఇరవై అయిదు వేల మంది ఈ మందును తీసుకున్నారు .ఏ ఒక్కరికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కలగలేదు. కారణాలేవైనప్పటికీ ఒక్కసారిగా నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం ఈ మందు పై ఫోకస్ పెట్టింది.తదుపరి పరిణామాల్లో ఆ మందు తయారీ నిలిచిపోయింది.అయితే ఇప్పటికీ ప్రజల నుండి, పలు రాజకీయ పార్టీల నుండి తక్షణమే ఈ మందు పంపిణీని పునరుద్ధరించాలని డిమాండ్లు వస్తున్న తరుణంలో పొరుగు రాష్ట్రమైన తెలంగాణ లోని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఒకరు ఆనందయ్య తయారుచేసిన ఔషధంపై ప్రతికూల వ్యాఖ్యలు చేశారు.
జరాభద్రం అని చెప్పిన జగిత్యాల ఎమ్మెల్యే!
కరీంనగర్ జిల్లా జగిత్యాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వృత్తిరీత్యా డాక్టర్ కూడా! ఎమ్మెల్యేగా గెలవకముందు ఆయన అక్కడ ప్రఖ్యాత నేత్ర వైద్యుడు.జగిత్యాల ప్రభుత్వాస్పత్రిలో కరోనా చికిత్స పొందుతున్న రోగులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గురువారం పరామర్శించారు.ఈ సందర్బంగా ఆయన ఆనందయ్య మందుపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు.తనకు బాగా తెలిసిన ఒకరికి కరోనా సోకగా వారి కుటుంబసభ్యులు కృష్ణ పట్నం వెళ్ళి ఆనందయ్య మందులు తెచ్చి సదరు రోగికి వాడారని,అయితే అదే పని చేయలేదని ఎమ్మెల్యే చెప్పారు.
ఆనందయ్య ఇచ్చిన మందును రోగి కళ్లలో పోయగా కరోనా తగ్గడం అటుంచి అతను ఆ రాత్రంతా కళ్లమంటలు అంటూ కేకలు పెట్టాడని ఎమ్మెల్యే పేర్కొన్నారు.”ఎమ్మెల్యేగానే కాకుండా ఒక డాక్టర్ గా కూడా చెబుతున్నాను.. ఆనందయ్య మందు కరోనాను తగ్గించదు. అలాంటి నాటు మందులు ,పద్ధతులను ఇప్పుడు కూడా ప్రజలు నమ్మడం మంచిది కాదు”అని సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఆ ముందు గనుక పనిచేసి ఉంటే తానే తెప్పించి జగిత్యాల ప్రభుత్వాస్పత్రిలో ఉన్న కరోనా రోగులందరికీ వేయించి ఉండేవాడినని కూడా ఎమ్మెల్యే వెల్లడించారు.ఆనందయ్య మందుకే అంత శక్తి ఉంటే ఇంతగా డాక్టర్లు, వైద్యసిబ్బంది ,ప్రభుత్వం హైరానా పడాల్సిన అవసరం కూడా ఉండదు కదా అని ఆయన వ్యాఖ్యానించారు.ఇప్పటికైనా ప్రజలు ఇలాంటి వాటిని నమ్మకుండా శాస్త్రీయ పద్ధతుల్లో జరిగే చికిత్సను ఉంది ఆరోగ్యవంతులు కావాలని ఎమ్మెల్యే సలహా ఇచ్చారు.