క్యాబినెట్ నిన్న కొత్త సచివాలయ డిజైన్ ను ఆమోదించిన నేపథ్యంలో తెలంగాణ బీజేపీ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేసింది. ప్రతిపక్షాన్ని పరిగణలోకి తీసుకోకుండా డిజైన్ ను ఎలా ఆమోదిస్తారని వారు ప్రశ్నించారు. కొత్త డిజైన్ ఎక్కడా ప్రభుత్వ పరిపాలనా విభాగంలా లేదని, ఒక మసీదు డిజైన్ లా ఉందని, హజ్ హౌజ్ ను తలపిస్తోందని విమర్శించారు.
సీఎం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు మానుకోవాలని సూచించారు. కొత్త సచివాలయ నిర్మాణానికి నమూనా ఎంఐఎం నేతలు ఇచ్చారా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఎనిమిదో నిజాం రాజులా ప్రవర్తిస్తున్నారని, కొత్త సచివాలయ నిర్మాణం కోసం పాత భవంతిని పడగొట్టడం ఎందుకో చెప్పాలని, ఆ భవనాలు 50 ఏళ్ల వరకూ పనిచేస్తాయని నిపుణులు చెప్పారని, అయినా కేసీఆర్ అన్నీ పెడచెవిన పెడుతున్నారని దుయ్యబట్టారు.