తెలంగాణ పాత సచివాలయం స్థానంలో కొత్త భవనం నిర్మాణం చేపట్టేందుకు హైకోర్టు అనుమతి తెలపడంతో అర్ధరాత్రి నుండి సచివాలయం వైపు వెళ్ళే దారులని ప్రభుత్వం మూసివేసింది. ఆ ర్అండ్ బి ఆధ్వర్యంలో కూల్చివేత పనులు మొదలు పెట్టిన ప్రభుత్వం అందుకు సంబంధించిన అన్ని పనులను అర్థరాత్రి నుండే మొదలుపెట్టింది.
ఇక ఇప్పుడు తెలంగాణ సచివాలయం కొత్త భవనం డిజైన్ విడుదలైంది. త్వరలోనే డిజైన్కు సీఎం కేసీఆర్ కూడా ఆమోదముద్ర వేయనున్నారు. కూల్చివేత లో భాగంగా మొదట జి, సి బ్లాక్లను పడగొట్టనుండగా… పాత శివాలయం స్థానంలో కొత్త సచివాలయం నిర్మించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది.
అయితే సచివాలయం కూల్చివేతకు వ్యతిరేకంగా అనేకమంది కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ కూల్చివేత ప్రక్రియ ఆలస్యం అయింది.