తెలంగాణలో పదవ తరగతి పరీక్షల షెడ్యుల్ ను విద్యాశాఖ ఖరారు చేసింది. ఏప్రిల్ 3వ తేదీ నుండి 11వ తేదీ వరకూ పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పరీక్షలు నిర్వహిస్తారు. సైన్స్ పరీక్ష మాత్రం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.50 గంటల వరకూ జరుగుతుంది.
ఏప్రిల్ 3: మొదటి భాష (ఫస్ట్ ల్యాంగ్వేజ్)
ఏప్రిల్ 4: రెండవ భాష (సెకండ్ ల్యాంగ్వేజ్)
ఏప్రిల్ 6: ఇంగ్లీషు
ఏప్రిల్ 8: గణితం
ఏప్రిల్ 10: సైన్స్
ఏప్రిల్ 11: సాంఘీక శాస్త్రం
ఏప్రిల్ 12: ఓఎస్ఎస్సీ మొదటి పేపర్
ఏప్రిల్ 13: ఓఎస్ఎస్సీ రెండో పేపర్ పరీక్ష జరుగుతాయి,
పదవ తరగతి పరీక్షల పేపర్లను రాష్ట్ర ప్రభుత్వం 11 నుండి ఆరుకు తగ్గించింది. ప్రస్తుత విద్యాసంవత్సరం నుండి పరీక్షల్లో మార్పులు, చేర్పులు అమలు చేస్తున్నారు. తొమ్మిది, పదవ తరగతికి చెందిన పరీక్షల విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం సంస్కరణలు తీసుకువచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం ఆరు సబ్జెక్ట్ లకు గానూ 600 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తుండగా, ఒక్కో సబ్జెక్ట్ కు వంద మార్కుల్లో ఫార్మేటివ్ అసెస్ మెంట్స్ కు 20 చొప్పున మార్కులు, తుది పరీక్ష కు 80 మార్కులు చొప్పున ఉంటాయి.