తెలంగాణలో రోజురోజుకి కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతుంది. ఆ మహమ్మారి దాడికి అడ్డుకట్ట అనేదే లేకుండా పోతుంది. వరుసగా వారం రోజుల నుండి అత్యధిక సంఖ్యలో కేసులు నమోదు కావడంతో పాటు అధిక స్థాయిలో మరణాలు కూడా సంభవించడం గమనార్హం. ఇలాంటి సమయంలో అటు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మరియు రాష్ట్ర హోం మినిస్టర్ కే కరోనా సోకడం ఆ వ్యాధి తీవ్రతను తెలియజేస్తోంది.
ఇలాంటి సమయంలో తెలంగాణ స్టేట్ కరోనా సమస్యల గురించి ఆరా తీసి వివరించే అధికారి మరియు స్టేట్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసులు కరోనా బారిన పడడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. తెలంగాణ కరోనా హెల్త్ బులిటెన్ ఆయన ఆధ్వర్యంలోనే విడుదల చేస్తారు. అటువంటి వ్యక్తి కి ఇప్పుడు కరోనా సోకడం ఇప్పుడు సాధారణ ప్రజల్లో భయభ్రాంతులను రేపుతోంది.
ఇక కెసిఆర్ ఈ మధ్య కాలంలో ప్రజల మధ్య కరోనా గురించి మరియు దాని తీవ్రత గురించి మాట్లాడుతూ ఎటువంటి ధైర్యం ఇవ్వకపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం. మరి ఎమ్మెల్యేలకు మరియు అధికారులకు కోవిడ్ సోకడం పై కేసీఆర్ ఎంత త్వరగా స్పందించి ప్రజల్లో అంత త్వరగా ధైర్యం నింపితే బాగుంటుందని చర్చ.