Telugu Desam Party: టీడీపీ 40 వసంతాల వేడుకల సందర్భంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. మంగళవారం టీడీపీ 40వ వసంతాల వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగాయి. ఏపి మంగళగిరి పార్టీ కార్యాలయంలో నారా లోకేష్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరగ్గా, హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ వేదికగా జరిగిన వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన ప్రసంగంల సీనియర్ నేతలకు షాకింగ్ న్యూస్ చెప్పారు. పార్టీలో యువతను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున 40 శాతం సీట్లను యువతకే కేటాయించనున్నట్లు ప్రకటించారు. పార్టీ కోసం యువత ముందుకు వచ్చి పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
Telugu Desam Party: గాడ్ ఫాదర్ లేడని భయపడాల్సిన అవసరం లేదు
రాజకీయాల్లో గాడ్ ఫాదర్ లేడని భయపడాల్సిన అవసరం లేదన్నారు. సమాజ హితం, రాజకీయాల్లో మార్పు తేవాలనుకుంటున్న వారు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. యువత ముందుకు వచ్చి న్యాయం కోసం పోరాడాలన్నారు. సంపదను సృష్టించడంలో టీడీపీ ముందుందని అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. యువతకు సీట్లు కేటాయించిన నియోజకవర్గాల్లో సీనియర్ల సేవలను పార్టీ ఉపయోగించుకుంటుందన్నారు.
నందమూరి తారక రామారావు ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావం, టీడీపీ చరిత్ర, టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చంద్రబాబు వివరించారు. ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 40 దేశాలలో 200 నగరాల్లో టీడీపీ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయన్నారు. ఒక రాజకీయ పార్టీ 41 సంవత్సరంలోకి అడుగుపెట్టడం అరుదైన అవకాశమని చంద్రబాబు అన్నారు. ఈ వేడుకల్లో పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, యనమల రామకృష్ణుడు, కిమిడి కళావెంకట్రావు తదితరులు ప్రసంగించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?