Telugu Movies :మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్.. లాక్ డౌన్ పుణ్యమా అని ఇంటికే పరిమితమై ఓటిటీ లో వెబ్ సిరీస్ చూస్తూ కాలం గడిపేస్తున్నారు.. తాజాగా రేపు అనగా శుక్రవారం నాడు థియేటర్లో వరుసగా నాలుగు సినిమాలు సందడి చేయనున్నాయి..
వీటిలో సుశాంత్ హీరోగా తెరకెక్కిన కపటధారి ఒకటి.. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.. ఇక సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన విశాల్ చక్రం సినిమా కూడా రేపే విడుదల కానుంది.. విశాల్ × సుమంత్ మధ్య పోటీ నెలకొననుంది.. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో రేపటి వరకు వేచి చూడాలి మరి..
నరేష్ హీరోగా రూపొందుతున్న నాంది సినిమా కూడా రేపే విడుదల కాబోతుంది.. ఆసక్తికరమైన కథనం తో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ మంచి సక్సెస్ ను తీసుకొచ్చింది.. కన్నడ డబ్బింగ్ చిత్రం పొగరు కూడా తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది.. ధ్రువ సర్జా హీరో గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.. ఈ నాలుగు సినిమాల్లో ఏ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో రేపటి వరకు వేచి చూడాలి మరి..