NT Rama Rao: నందమూరి తారక రామారావు.. NT Rama Rao.. ఈపేరు తెలుగు ప్రజల గుండెల్లో శాస్వతంగా ఉండిపోయే పేరు. ‘రుధిరోద్గారి’ నామ సంవత్సరం, గ్రీష్మ రుతువు, శుక్లపక్ష త్రయోదశి, తులారాశి, తులాలగ్నం, స్వాతి నక్షత్రం 4వ పాదంలో 28 మే, 1923న మధ్యాహ్నం 04.26 గంటల సమయంలో కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించారు. ఆ కుటుంబం అనుకోలేదు ఆరోజు.. ‘పుట్టిన పసివాడు కారణజన్ముడని.. తెలుగు ప్రజల గుండెల్లో శాస్వత ముద్ర వేయబోతున్నాడని.. కళల్లో ఆరితేరతాడని.. ప్రజల తమ మనసుల్లో శ్రీరాముడు, కృష్ణుడిగా గుడి కట్టుకుని పూజిస్తారని.. రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తాడని..’ కానీ.. ఇవన్నీ జరిగిపోయాయి. ఎన్టీఆర్ అనే వ్యక్తిని సినీ అభిమానులు ఎన్టీవోడుగా పిలుచుకుంటే.. రాజీకీయాల్లో ‘అన్నా..’ అని ఎంతో ఆర్ధ్రంగా పిలుచుకున్నారు.
మనదేశం అనే సినిమాతో మొదలైన ఆయన సినీ ప్రస్థానం.. తెలుగుదేశం అనే రాజకీయ పార్టీతో మరో శకం ప్రారంభానికి నాంది పలికింది. ఇన్నేళ్లలో ఆయన చేసిన సినిమాలు చరిత్ర సృష్టించాయి. అందమైన ముఖవర్చస్సు, నిండైన విగ్రహరూపంతో ఆయన చేసిన పాత్రలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయి. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు.. అంటే ఎన్టీఆర్ లానే ఉండావాడని ప్రజలు ఫిక్స్ అయిపోయారు. ఆయన ఫొటోలు ఇళ్లలో దేవుడి పటాల మధ్య చేరిపోయింది. మాస్ సినిమాల్లో కూడా ఆయన వేసిన ముద్ర ఎన్టీఆర్ ను తిరుగులేని నెంబర్ వన్ ని చేశాయి. తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మద్రాసు వెళ్లి ఎన్టీఆర్ ని చూడాలి.. ఇదే ఒకప్పటి ప్రజల భావన.
Read More:Bala Krishna: ‘అఖండ’పై అభిమానుల్లో అందుకే అన్ని అంచనాలు..!
తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో ఆయన స్థాపించిన ‘తెలుగుదేశం’ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలను పాలించారు. పార్టీ స్థాపించి 38 ఏళ్లు.. అధికారం కూడా రెండు దశాబ్దాలకు పైగా. ఇదీ ఆ పార్టీ గొప్పదనం. ఎన్టీఆర్ ను దైవంలా కొలవడమే కాదు.. ఆయన స్ఫూర్తిగా ఎందరో వచ్చారు. త్వరలో జరగబోయే ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా దర్శకుడు వైవీఎస్ చౌదరి NTR@ అనే కొత్త బ్యానర్ ఏర్పాటు చేసి న్యూ టాలెంట్ రోర్స్ గా కొత్త టాలెంట్ ని తీసుకొస్తున్నారు. 28 మే, 2022 రోజు నుంచి 27 మే 2023 వరకూ వాటిని రకరకాల డిజిటల్ వేదికల ద్వారా జ్ఞాపకాల రూపంలో తెలుగు ప్రజలకు చేరువ చేయబోతున్నారు.