NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Rohini Sindhuri: వివాదం లో తెలుగు మహిళా ఐఏఎస్‌ రోహిణి సింధూరి!కర్నాటక ను షేక్ చేస్తోన్న కాంట్రవర్సీ!!

Rohini Sindhuri: కర్నాటకలో ఇద్దరు మహిళా ఐఏఎస్ ల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. వీరిలో ఒక మహిళా ఐఏఎస్ ఏకంగా తన పదవికి రాజీనామాను ప్రకటించడం సంచలనం రేపుతోంది.దేశ చరిత్రలోనే అసాధారణమైన పరిణామమని ఐఏఎస్ వర్గాలు చెప్తున్నాయి.

అసలేం జరిగింది?

మన తెలుగమ్మాయి రోహిణి సింధూరి మైసూరు జిల్లా డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్నారు.విధి నిర్వహణలో మహా కచ్చితంగా ఉంటారని మంత్రుల్నే లెక్కచేయరని రోహిణి సింధూరికి ఇమేజ్ ఉంది.హాసన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ గా వుండగా ఆమెకి ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి మంజుకు మధ్య వార్ జరిగింది.ఆ జిల్లాలో సాగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలను రోహిణి సింధూరి ఉక్కుపాదంతో అణిచేయడ౦ రాజకీయ నాయకులకు ఇబ్బందికరంగా తయారైంది.రాజీలేని ధోరణితో వ్యవహరిస్తున్న రోహిణికి చెప్పేందుకు కూడా ఎవరూ సాహసించని పరిస్థితుల్లో మంత్రి మంజు నాయకత్వంలో పలువురు రాజకీయ ప్రముఖులు అప్పటి ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు మొరపెట్టుకొని ఆమెను హసన్ నుండి ట్రాన్సఫర్ చేయించారు.అయితే మొండి ఘట్టమైన రోహిణి సింధూరి హైకోర్టు ఏపి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కు వెళ్లి హసన్ లోనే కొనసాగే విధంగా ఆర్డర్లు తెచ్చుకుంది.తదుపరి పరిణామాల్లో ఆమె మైసూరుకు బదిలీ అయ్యారు.ప్రజల్లో అయితే ఆమెకు మంచి ఇమేజ్ ఉంది.

రోహిణి సింధూరి వర్సెస్ శిల్పా నాగ్!

అయితే మైసూర్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న శిల్పా నాగ్ అనే మరో మరో ఐఏఎస్ అధికారిణి తనను రోహిణి సింధూరి వేధిస్తున్నారంటూ ,ఈ పరిస్థితుల్లో తాను ఉద్యోగం లో కొనసాగలేనని పేర్కొంటూ తన పోస్టుకు రాజీనామా చేస్తున్నట్లు మీడియా సమావేశం పెట్టి మరీ ప్రకటించారు.మైసూరులో స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం ఏమాత్రం లేదు..  అందుకే నేను సివిల్‌ సర్వీసు ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను.. అని శిల్పా నాగ్ ప్రకటించడం సంచలనం రేపింది.రోహిణి సింధూరి తన విధులకు అడుగడుగునా అడ్డు తగులుతూ అనేక విధాలుగా వేధిస్తున్నారని శిల్పా నాగ్ ఆరోపించారు. అందుకే ఇక ఉద్యోగం కూడా చెయ్యలేక ఉన్నానని ఆమె తెలిపారు తన రాజీనామా పత్రాన్ని కర్నాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి పంపుతున్నట్టు ఆమె చెప్పారు.

పన్నెండు కోట్లకు లెక్క అడిగినందునేనా?

కాగా శిల్పా నాగ్ ఆరోపణలను రోహిణి సింధూరి ఖండించారు.మైసూరు కార్పోరేషన్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఖాతా కింద పన్నెండు కోట్ల రూపాయలు ఉండగా వాటిని ఏం చేశారని తాను శిల్పా నాగ్ ను అడిగినట్లు వెల్లడించారు.ఆ మొత్తం కనుక ఉంటే కరోనా టైంలో కొన్ని సహాయక చర్యలు చేపట్టాలన్నది తన ఉద్దేశమన్నారు.అయితే శిల్పా నాగ్ ఆ లెక్కలేవీ తనకు చెప్పలేదని,పైగా తనపైనే నిందవేసి అమె రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారన్నారు.ఈ విషయాలన్నింటినీ ప్రధాన కార్యదర్శి రవికుమార్ కు చెప్పానని ఎటువంటి విచారణకైనా తాను సిద్ధమని రోహిణి సింధూరి తెలిపారు.ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతున్న సంగతి పక్కనబెడితే ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారుల మధ్య ఈ స్థాయిలో ఘర్షణ జరగడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం అంటున్నారు.

author avatar
Yandamuri

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju