Breaking: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, ట్రక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు బోల్తా కొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న పది మంది దుర్మరణం పాలైయ్యారు. నాసిక్ – షిరిడి హైవేపై పథారే సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణీకులు ఉండగా, పది మంది మృతి చెందగా, చాలా మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తొంది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అంబర్ నాథ్ థానే ప్రాంతానికి చెందిన సాయి భక్తులు షిరిడి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
Pawan Kalyan: ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేసినట్లే(గా)..