తెనాలి, జనవరి7: గుంటూరు జిల్లా, తెనాలిలో వంగవీటి మోహన రంగా విగ్రహాన్ని మున్సిపల్ సిబ్బంది తొలగించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొన్నది. సోమవారం ఉదయం రంగా విగ్రహాన్ని తొలగించిన సంగతి తెలియగానే రంగా అభిమానులు, కాపునాడు కార్యకర్తలు అక్కడకు చేరుకుని ఆందోళన మొదలుపెట్టారు. రంగా విగ్రహన్ని తొలగించ వద్దని కాపునాడు అధ్వర్యంలో ఆందోళన చేపట్టినప్పటికీ మున్సిపల్ అధికారులు వినిపించుకోలేదని రంగా అభిమానులు, కాపునాడు కార్యకర్తలు పేర్కొన్నారు. విగ్రహన్ని కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.