అమరావతి: టిడిపి నిర్వహించతలపెట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని భగ్నం చేసిన పోలీసు యంత్రాంగం గుంటూరు టిడిపి పునరావాస కేంద్రంలో ఉన్న బాధిత కుటుంబాలను గ్రామానికి తరలించేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను పునరావాస కేంద్రం వద్దకు చేర్చారు. ముందుగా శిబిరంలో ఉన్న టిడిపి నేతలను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ప్రత్యేక వాహనాలలో బాధిత కుటుంబాలను గ్రామాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. గ్రామంలో తగిన రక్షణ కల్పిస్తామని పోలీసు అధికారులు వారికి భరోసా ఇచ్చి తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శిబిరం వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలు చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం అలుముకున్నది.
previous post
next post
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?