ఆస్ట్రియా రాజధాని వియన్నాలో కాల్పుల ఘటన జరిగింది. నగరంలోని ఆరు ప్రదేశాలలో అనేక మంది అనుమానితులు మారణాయుధాలతో ఏకకాలంలో ఫైరింగ్ జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. 15 మంది గాయపడ్డారు అని పోలీసులు తెలిపారు.
ఆస్ట్రియాలో కరోనావైరస్ మహమ్మారి కారణంగా లాక్ డౌన్ తిరిగి విధించడానికి కొన్ని గంటల ముందు షూటింగ్ జరిగింది.నగర సరిహద్దులో ఉన్న ఒక ప్రధాన మందిర్ వద్ద మొదటి తుపాకీ కాల్పులు జరిగాయి అని,కొన్ని క్షణాలలోనే మిగితా ప్రాంతాలలో సైతం ఈ దాడులు ప్రారంభమయ్యాయి అని అంతర్గత మంత్రి కార్ల్ నెహమ్మర్ మీడియాకు తెలిపారు. ఇది ఉగ్రదాడి అని, ఆటోమెటిక్ రైఫిల్, పిస్తోల్తో ఉన్న ఓ సాయుధుడిని పోలీసులు మట్టుబెట్టినట్లు ఆస్ట్రియా ఛాన్సలర్ సెబాస్టియన్ కుర్జ్ తెలిపారు. మరో దాడి చేసిన వ్యక్తి పరారీలో ఉన్నాడు అని, అతనికోసం పోలీసులు అన్వేషిస్తున్నట్లు హోంశాఖ మంత్రి తెలిపారు. వియన్నా సెంట్రల్లో ఉన్నమందిరాన్ని టార్గెట్ చేశారా లేదా అన్న అంశం స్పష్టంగా తెలియదు. ఈ దాడిలో ఇద్దరు మరణించగా, 15 మంది గాయపడ్డారని, వారంతా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు మేయర్ మైఖేల్ లుడ్విగ్ తెలిపారు.