Foodies: మనలో చాలా మందికి రెస్టారెంట్ కి వెళ్లి తినడం అంటే ప్రీతీ ఉంటుంది. ఫుడీస్ అయితే నాలుగైదు రకాలు రుచి చూస్తూ ఉంటారు. సాధారణంగా ఇటువంటి ఫుడీస్ కు థాలి బెస్ట్ అని చెప్పొచ్చు. ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ ఉండడంతో ప్లేట్ తో పాటుగా ఫుడీస్ పొట్టకూడా నిండిపోతుంది.
అదే మీరు ఫుడ్ మొత్తం తినండి బిల్ పే చెయ్యక్కర్లేదు తిరిగి మేమే డబ్బుని చెల్లిస్తాం అంటే?? అంతకు మించిన ఆఫర్ ఉంటుందా!! నిజం… ఢిల్లీ లోని ఓ ప్రముఖ రెస్టారెంట్ ఈ ప్రకటన చేసింది. వారు ఇచ్చే రివార్డ్ ఎంతో తెలుసా? అక్షరాలా రూ.2 లక్షలు..
ఈ ఆఫర్ ను మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని ఓ రెస్టారెంట్ పెట్టింది. ఆ రెస్టారెంట్ పేరు `కుటుంబ్ రెస్టారెంట్`. ఇందులోని భోజనం ఎంతో రుచికరంగా ఉంటుందట. అంతేకాకుండా ఈ రెస్టారెంట్ వారు కస్టమర్స్ కోసం చేసిన ఈ వింత ప్రకటన కి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఈ రెస్టారెంట్ లో వారు చేసిన ఛాలెంజ్ లో అందించేది జంబో శాఖాహార థాలీ. ఈ థాలీకి మరో పేరు కూడా ఉంది అదే సంపూర్ణ థాలీ. ఈ రెస్టారెంట్ వారు చేసిన ఛాలెంజ్ ను ఎవరైనా స్వీకరించాలి అనుకుంటే రోహిణి, లేదా గురుగ్రామ్ లో ఉన్న ఔట్లెట్ రెస్టారెంట్ కు వెళ్ళలిసిందే.
ఈ ఛాలెంజ్ లో ఇంకొక ముఖ్యమయిన విషయం ఏమిటంటే ఈ థాలి ని కేవలం అరగంట లో ఖాళీ చేసేయాలి. అప్పుడే వారిని విజేత గా ప్రకటించి ఆ రూ. 2 లక్షలను వారిని ఇస్తారు. ఈ థాలీలో ఏకంగా 45 ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. ఇక ఈ జంబో ప్లేటు బరువెంతో తెలుసా… 18.5 కేజీలు.