కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచ పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి అర్థం కావటం లేదు. ఈ మహమ్మారి వల్ల ప్రపంచంలో చాలా దేశాల్లో ఆర్థికంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్లు వస్తున్నా గాని సరిగ్గా పనిచేసే వ్యాక్సిన్ ఏది అన్నది ఇంకా ఎవరు తేల్చుకోలేకపోతున్నారు. ప్రపంచంలో పరిస్థితి ఇలా ఉన్న తరుణంలో కరోనా పుట్టినిల్లు చైనా దేశం మళ్లీ లాక్ డౌన్ విధించటం ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది.
విషయమేమిటంటే ఉత్తర చైనాలో కేసులు ఉన్న కొద్దీ పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించడంతో ఆ ప్రాంతం లో లాక్ డౌన్ విధించారు. ఈ ప్రాంతం నుండి రైళ్లు, విమాన సర్వీసు రాకపోకలు ఆపేయటం మాత్రమే కాక కఠిన నిబంధనలు విధిస్తున్నారు. అదేవిధంగా స్కూళ్లు కాలేజీలు క్లోజ్ చేయటమే కాక వచ్చే ఏడాది వింటర్ ఒలింపిక్స్ కోసం ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో వైరస్ తీవ్రత పెరగడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మరోపక్క అంతర్జాతీయ మీడియా దృష్టి మరల్చడానికి కరోనా వైరస్ పుట్టినిల్లు అయిన ఈ ప్రాంతంలో ఎటువంటి సర్వేలు జరగకుండా చైనా దొంగ గేమ్ ఆడుతున్నట్లు.. నకిలీ లాక్ డౌన్ ప్రకటనలు చేస్తున్నట్లు కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. కావాలని వైరస్ ఈ ప్రాంతంలో చైనా పుట్టించినట్లు తేలితే అంతర్జాతీయంగా అన్ని దేశాలకు శత్రువు అవుతుందని చైనా దేశం ఈ విధంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా కరోనా వైరస్ పుట్టినిల్లు అయిన చైనా దేశంలో మళ్లీ లాక్ డౌన్ అనేసరికి ప్రపంచం మొత్తం ఒక్కసారిగా షాక్ అవుతుంది.