మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చేస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. మెగాస్టార్, కాజల్ అగర్వాల్ సహా ప్రధాన తారగాణం పాల్గొంటున్న సీన్స్ ని కంప్లీట్ చేస్తున్నాడు కొరటాల శివ. ఇక ఈ సినిమా చిరు కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్, మాట్నీ మూవీస్ బ్యానర్స్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘ఆచార్య’ ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ సినిమా మీద భారీగా అంచనాలు పెంచాయి.
కాగా 2021 సమ్మర్ లో రిలీజ్ చేయనున్నట్టు ఆచారూ టీం అధికారకంగా వెల్లడించారు. ఇప్పటి వరకు కొరటాల శివ తెరకెక్కించిన సినిమాల మాదిరిగానే ఆచార్య సినిమా సామాజిక అంశంతో పాటు మంచి సందేశంతో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలలో నటించబోతున్నట్టు తెలిసిందే. కాగా ఈ సినిమాలలో మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ గా రూపొందుతుంది. ఈ సినిమాకి రీసెంట్ గా తమిళ డైరెక్టర్ మోహన్ రాజా ని ఫైనల్ చేసి అధికారకంగా ప్రకటించారు.
అంతేకాదు ఈ సినిమా న్యూయర్ లో సెట్స్ మీదకి వెళ్ళబోతోంది. అంతేకాదు శరవేగంగా షూటింగ్ జరిపి విజయదశమి సందర్భంగా రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. అయితే నిన్నా మొన్నటి వరకు ఈ సినిమా కి దర్శకుడు ఎవరన్నది ఫైనల్ కాకపోవడంతో ముందు మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాలం మొదలవుతుందని వార్తలు వచ్చాయి. అయితే మోహన్ రాజా అద్భుతంగా స్క్రిప్ట్ రెడీ చేసి మెగాస్టార్ ని మెప్పించడం తో వెంటనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళేందుకు రెడీ అయిపోయారు. ఈ సినిమా తర్వాతే మెహర్ రమేష్ మెగాస్టార్ కాంబినేషన్ లో వేదాలం తెలుగు రీమేక్ మొదలవుతుందట.