ఎవరైనా కష్టకాలంలో ఉన్నారంటే చాలు.. చాలా మంది దాతలు తమ పెద్దమనసును చాటుకుంటారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ పెట్టినప్పుడు చాలా మంది తిండి లేక రోడ్డున పడ్డవారెందరో ఉన్నారు. అలాంటి వారి కోసమే దాతలు మేమున్నామంటూ మందుకొస్తున్నారు. పేదల ఆకలిని తమ ఆకలిగా భావించి వారి పడుపు నింపారు.
ముఖ్యంగా కరోనా కష్టకాలంలో అందరినీ ఆదుకుంటూ సినిమాల్లో విలన్ గా నటిస్తూ రియల్ లో తన హీరో ఇజాన్ని చాటుకుంటున్న సోనూ సూద్ గుర్తొస్తాడు. లెక్కలేనన్ని డబ్బులు ఖర్చు చేస్తూ.. తన మంచి మనసును చాటుకుంటున్నారు మన హీరో.. ఇలా ఎందరో తమ సమయాన్ని పేదల కడుపునింపడానికి వెచ్చిస్తున్నారు.
ఇదిలా ఉంటే పేదలెవరూ ఆకలితో అలమటించకూడదనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఓ కమ్యునిటీ ఫ్రిజ్ ఇప్పుడు ఎంతో మంది కడుపులు నింపుతోంది. ముంబాయి వాసులు సెయింట్ జోసెఫ్ ప్రైమరీ స్కూల్ ప్రాంగణంలో ఈ ఫ్రిజ్ ను ఏర్పటు చేశారు. ఎంతో గొప్ప మనసుతో ఏర్పాటు చేసిన ఈ ఫ్రిజ్ లో రకరకాల ఆహార పదార్థాలు ఉచితంగా లభిస్తున్నాయి.
ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న కాలనీవాసులు తమ ఇంట్లో తయారు చేసుకున్న వంటకాలను తెచ్చి ఈ ఫ్రిజ్ లో పెడుతున్నారు. దాంతో పేదలు అందులో ఉండే తమకవసరమైన ఆహారాన్ని తీసుకుని తమ కడుపులు నింపుకుంటున్నారు. ఈ కరోనా వల్ల ఎంతో మంది రోడ్డున పడిన సంగతి తెలిసిందే.. అయితే వారు ఆకలి మంటలతో జీవించకూడదనే ఈ ఏర్పాటు చేశారు కొందరు ముంబాయి వాసులు. వారి సేవలకు జోహారులు అంటున్నారు అక్కడి స్థానికులు.