Thank you brother : థ్యాంక్యూ బ్రదర్..సినిమా రమేష్ రాపర్తి దర్శకత్వంలో మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్ బొమ్మి రెడ్డి నిర్మాణంలో మే 20వ తేదిన థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ మూలంగా ఈ సినిమాని మే 7న ఆహా లో స్ట్రీమింగ్ చేయనున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో అనసూయ ప్రధాన పాత్రలో నటించింది. అశ్విన్ విరాజ్ కీలక పాత్రలో నటించాడు. థ్యాంక్యూ బ్రదర్ టీజర్ అండ్ ట్రైలర్స్ ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగేలా చేశాయి .
ఇక ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ మూవీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కగా.. అనసూయ నిండు గర్బిణిగా ఈ సినిమాలో కనిపిస్తుందని ఎప్పుడు చేయని ఒక వైవిధ్యమైన పాత్రలో ప్రేక్షకులను మెప్పించబోతున్నట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేసేందుకు చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇవి కేవలం పుకార్లని అందరు భావించారు. కాని అనూహ్యంగా ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ విషయం నటి
అనసూయ అభిమానులను నిరాశ పరిచిందనే చెప్పాలి. థియేటర్లు మూసి వేయడంతో తప్పనిసరైన పరిస్థితుల్లో ఓటిటిలో
విడుదల చేయడానికై మేకర్స్ డిసైడయ్యారు.
Thank you brother : థ్యాంక్యూ బ్రదర్ …. నేరుగా ఓటీటీలోనే…!
ఒక వైపు థియేటర్లు మళ్ళీ తిరిగి ఎప్పుడు ఓపెన్ అవుతాయో.. క్లారిటీ కూడా లేదు. మరో వైపు పెద్ద సినిమాలు లైన్ లో విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక వేయిట్ చేయడం కరెక్ట్ కాదని ఓటిటిలో విడుదల చేయబోతున్నారు. అందుకే థ్యాంక్యూ బ్రదర్ ను నేరుగా ఓటీటీలో విడుదల చేయడం మంచి ప్లాన్ అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా నిర్వహించనున్నారు. ఈ ప్రమోషన్స్ కి సంబంధించిన విషయమై జబర్దస్త్ లో కూడా అనసూయ సందడి చేసిన విషయం తెలిసిందే. చూడాలి మరి ఈ సినిమా అనసూయకి ఎలాంటి సక్సస్ ఇస్తుందో.