Sukumar : సుకుమార్ దర్శకుడిగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే మరొక వైపు నిర్మాణం కూడా చేపట్టిన సంగతి తెలిసిందే. తన వద్ద అసోసియేట్స్ గా చేస్తున్న వాళ్ళకి దర్శకుడిగా తన బ్యానర్ లోనే అవకాశం కల్పిస్తున్నాడు. కుమారి 21ఎఫ్ తో పలనాటి సూర్య ప్రతాప్ ..ఉప్పెన సినిమాతో బిచ్చిబాబు సానా ని ఇండస్ట్రీకి దర్శకులుగా పరిచయం చేశాడు. ఇక త్వరలో మరొక అసోసియేట్ ని సుకుమార్ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం చేయబోతున్నాడు. కాగా ఇటీవల ఆర్ ఎక్స్ 100 ఫేం కార్తికేయ హీరోగా లావణ్య త్రిపాటి హీరోయిన్ గా ఒక సినిమా వచ్చింది.
ఆ సినిమానే చావు కబురు చల్లగా. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ 2 లో నిర్మించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది. దాంతో ఇక మళ్ళీ కార్తికేయకి ఇప్పట్లో అవకాశాలు రావని అందరు భావించారు. ఈ సినిమా ఫ్లాప్ అని తెలిశాక కార్తికేయ కూడా మరో ఛాన్స్ ఇవ్వండి ప్రూవ్ చేసుకుంటా అంటూ రిక్వెస్ట్ కూడా చేశాడు. మొత్తానికి విషయం ఏంటో తెలీదు గాని సుకుమార్ బ్యానర్ లో కార్తికేయ సినిమా చేయబోతున్నాడు. సుకుమార్ దర్శకులనే కాదు హీరోలని బాగా నమ్ముతాడు. సత్తా ఉంటే ఆ హీరో సినిమా చేసేస్తాడు.
Sukumar : ఈ సినిమాతో అయిన కార్తికేయ హిట్ కొడతాడా…!
ఇక ఈ సినిమా గీతా ఆర్ట్స్ 2 తో కలిసి సుకుమార్ నిర్మిస్తుండటం విశేషం. కార్తికేయ నటించిన చావు కబురు చల్లగా జీఏ2 లోనే వచ్చి ఫ్లాప్ గా మిగిలింది. అయినా వీరు మళ్ళీ కార్తికేయ తో సినిమా నిర్మించాలనుకోవడం గొప్ప విషయం. ఇక ఈ విషయాన్ని స్వయంగా కార్తికేయ వెల్లడించాడు. త్వరలో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందని సమాచారం. చూడాలి మరి ఈ సినిమాతో అయిన కార్తికేయ హిట్ కొడతాడా లేదా.