కష్టకాలంలో ఆదుకునే నాయకుడే ప్రజలకు కావాలి.కబుర్లు చెప్పేవాడు కాకుండా తమ కష్టంలో పాలుపంచుకునే నేత కోసం ప్రజలు వేయి కళతో ఎదురుచూస్తుంటారు.
అలాంటి నాయకుడు దొరికితే గుండెల్లో పెట్టి పూజించుకుంటారు.స్టార్ హీరో ,ఎమ్మెల్యే కూడా అయిన నందమూరి బాలకృష్ణ కరోనా సమయంలో ప్రజలకు చేస్తున్న సేవలు అన్నీ ఇన్ని కావు అయితే అంతా గుప్తంగానే జరిగిపోతోంది.కరోనా వేళ బాలయ్య బాగానే వితరణ చేస్తున్నారు. ఆయన ఏపీ, తెలంగాణా ప్రభుత్వాలకు చెరి యాభై లక్షల రూపాయలను విరాళంగా అప్పట్లో ఇచ్చారు. మరో పాతిక లక్షలు చిరంజీవి ఆద్వర్యాన ఏర్పాటు అయిన సంస్థకు ఇచ్చి సినీ కార్మికులకు అండగా నిలిచారు.
ఇది చాలదన్నట్లుగా తన సొంత ఖర్చుతో సినీ కార్మికులకు కరోనా మందులను కూడా నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ వీవీ వినాయక్ ద్వారా పంపిణీ చేయించారు. తాను చైర్మన్ గా ఉన్న బసవతారకం ఆసుపత్రి సిబ్బందికి కూడా బాలయ్య కరోనా మందులను సరఫరా చేసి తన గొప్పతనాన్ని చాటుకున్నారు. మరోవైపు రెండు సార్లు తనను గెలిపించిన హిందూపురం ప్రజలను ఆదుకునేందుకు 55 లక్షల రూపాయల విలువ చేసే కరోనా మందులను ఏకంగా కోవిడ్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. అంతే కాదు, అక్కడ ఉన్న వైద్యులకు కూడా మెడికల్ ఎక్విప్మెంట్స్ ని కూడా పంపించారు.
ఇప్పటిదాకా కొద్ది మంది ఎమ్మెల్యేలు తప్ప ఎవరూ సొంత ఖర్చుతో కరోనా వేళ ప్రజలను ఆదుకోలేదుఅంతెందుకు బాలయ్య బావ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కరోనా సాయంగా ఇచ్చింది కేవలం పది లక్షల రూపాయలు!కానీ బాలయ్య బాబు ఇచ్చింది అన్నీ కలుపుకుంటే కోర్టు రూపాయలు దాటిపోతోంది! టిడిపి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర పార్టీ అగ్ర నాయకులు బాలయ్య ను ఆదర్శంగా తీసుకుని ప్రజలకు చేతనైన సాయం చేయగలిగితే టిడిపి పరిస్థితి కూడా మెరుగు పడగలదు.కానీ బాలయ్య బాబు చేసిన కరోనా సాయం ఆయన అభిమానులు కాలర్ ఎగరేసేలా చేశాయి. రియల్ హీరో అంటే మా వాడురా అని బాలయ్య అభిమానులు మీసాలు తిప్పుతున్నారు.