టిడిపి ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి పర్యటనకు వస్తున్నారంటే అధికారులు హడలెత్తి పోయేవారు.సిఎం టూర్ కిచేయాల్సిన ఏర్పాట్లపైనే వారి దృష్టంతా ఉండేది!
ముఖ్యమంత్రి వచ్చే వెళ్ళి పోయేంతవరకు అధికారులు ఇంక ఏ పని చేసేవారు కాదు! అది చంద్రబాబు నాయుడు జమానా! కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవహార శైలి అందుకు పూర్తి భిన్నంగా ఉండడంతో ఇప్పుడు అధికారులకు ఏ టెన్షన్ లేదు! గోదావరి ముంపు ప్రాంతాన్ని పరిశీలించడానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆయన వెంట హోం మంత్రి సుచరిత, మరో మంత్రి పేర్ని నాని మాత్రమే ఉన్నారు. అధికారులెవరూ జగన్ వెంట లేరు.జగన్ కేవలం ఏరియల్ సర్వేకే పరిమితమయ్యారు.
జగన్ మోహన్ రెడ్డి హెలికాఫ్టర్ నుండి అంతా చూసి వెనక్కు వచ్చేశారు తప్పితే ఆ ప్రాంతంలో దిగి అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించలేదు.సీఎం పని సీఎం చూసుకున్నారు అధికారులు తమ పని తాము చేసుకున్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు పునరావాసం కల్పించే కార్యక్రమాల్లో వారు నిమగ్నమయారు.వారికి సీఎం టూర్ పరంగా ఎటువంటి డిస్టర్బెన్సు కలుగలేదు! దీంతో అధికారులు చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన టూర్ కి వస్తే తాము ఎలాంటి ఇబ్బందులు పడే వారు గుర్తు చేసుకుంటున్నారు.ఇది నిజమే.మీడియాకు కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయి .
చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే నిర్వహి౦చాక విపత్తు చోటు చేసుకున్న చోటకు కొన్ని కిలోమీటర్ల ఆవల మకాం పెట్టే వారు. అక్కడకు అధికారులంతా రావాల్సిందే! జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ముఖ్య అధికారులు ముఖ్యమంత్రి తో ఉండాల్సి౦దే. ఇక చంద్రబాబు సమీక్ష సమయంలో అధికారులపై ఫైర్ కావడం ,అది ఎల్లో మీడియాలో ప్రొజెక్టు కావడం ఇంకో తంతు.మొత్తం మీద కావాల్సిన ప్రచారమంతా వచ్చాక గానీ చంద్రబాబు అక్కడ నుండి కదలి వెళ్లేవారు కాదు.అప్పటివరకు అధికారులంతా అక్కడే బందీలుగా ఉండిపోయేవారు.
కీలక సమయంలో అధికారులు లేకపోవటం వల్ల ప్రజలుఇబ్బంది పడే వారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రచారానికి ప్రాధాన్యమిచ్చేవారు. ఇందుకు పూర్తి విరుద్ధంగా జగన్ కేవలం తను ఒక్కడే ఏరియల్సర్వే నిర్వహించి వెళ్లి పోయారు. దీంతో అధికారులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు.పర్యటనకు బయల్దేరే ముందే అధికారులు తన కార్యక్రమానికి రానక్కర్లేదు అని పునరావాస చర్యలను కొనసాగించాలని సీఎం స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు కూడా సమాచారం.ఒక అధికారి దీన్ని విశ్లేషిస్తూ చంద్రబాబుకు ప్రచారం ముఖ్యం.. ప్రస్తుత సీఎం జగన్ కి ప్రజలు ముఖ్యం అని తేల్చేశారు.ఇంతకంటే చెప్పాల్సింది ఏమీ లేదు!