బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వాడుకున్న చంద్రబాబు.. వీరిని పట్టించుకోలేదనేది వాస్తవం. ఈ విషయాన్ని పక్కకు పెట్టి.. జగన్పై ఎల్లో మీడియా వికృత రాతలు రాయడం వల్ల బాబే విలన్గా మారిపోయారు.
చంద్రబాబు అనుకూల మీడియా చేసిన అత్యుత్సాహం.. ఇప్పుడు బాబునే ఇరికించిందనే వ్యా ఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు చేసిన ప్రయత్నం వికటించి.. నేరుగా చంద్రబాబుకే దెబ్బ తగిలేలా చేసిందని అంటున్నారు. విషయంలోకి వెళ్తే.. `సంచార జాతులకు విముక్తి ఏదీ?` శీర్షికన చంద్రబాబు అనుకూల మీడియాలో పుంఖాను పుంఖాలుగా ఓ కథనం వచ్చింది. దీనిలో బీసీ వర్గానికి చెందిన బీసీ-ఏ సబ్ కేటగిరీలో చాలా సామాజికవ ర్గాలు నేటికి ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉన్నారని, వీరిని జగన్ ప్రభుత్వం కన్నెత్తి చూడడం లేదని, పన్నెత్తి పలకరించడం లేదని కూడా రాసుకొచ్చింది
ఏడాదికో చోట సంచార జీవనం గడుపుతూ ఉండే ఈ జనాలకు…. రేషన్కార్డులు, ఆధార్కార్డులు, బ్యాంకు ఖాతాలు వంటి గుర్తింపులు కూడా లేకపోవడంతో ఎలాంటి ప్రభుత్వ పథకాలకూ నోచుకోవడం లేదు. అందుకే జగన్ ప్రభుత్వం ఇచ్చిన నవరత్నాలకు సంబంధించిన పథకాల్లో వీరెవరూ లబ్ధిదారులు కాలేకపోయారు. అని సదరు మీడియా రాసుకొచ్చింది. ,
అయితే, అంతకు ముందు ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి బీసీలే తమకు ప్రాణమని చెప్పుకొచ్చిన చంద్రబాబు కానీ, ఆ పార్టీ నేతలు కానీ .. వీరిని ఎందుకు పట్టించుకోలేదు.? నిర్దిష్టమైన రేషన్కార్డులుగానీ, ఆధార్, బ్యాంకు ఖాతాలు ఎందుకు ఇవ్వలేక పోయారు?అన్నది ఆయన అనుకూల మీడియాకు పట్టడం లేదు. నిజానికి రాష్ట్రంలో బీసీలే తమకు వెన్నెముక అని చెప్పుకొచ్చే చంద్రబాబు.. గడిచిన ఐదేళ్ల కాలంలో ఈ కులాల వారికి ఏదైనా చేస్తానంటే.. ఎవరైనా వద్దని చేయి అడ్డు పెట్టారా? లేక వద్దని ఆయా కులాల వారే ఏమైనా వినతి పత్రాలు ఇచ్చారా ? నాడు చంద్రబాబు పట్టించుకుని, ఆయా కులాల వారికి అన్ని రకాల సదుపాయాలు అమలు చేసి ఉంటే.. నేడు అమలు చేయడం లేదని శోకించినా అర్ధం ఉంటుంది.ఏదేమైనా టిడిపి అనుకూల మీడియా ప్రచారం ఆకాశంపై ఉమ్మేసి నట్టుగా వుంది అది చంద్రబాబుపైనే పడుతోందని పరిశీలకులు చెబుతున్నారు.