NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

`‌ రెడ్డి ‘ గారి మీద అలిగిన జగన్ .. రివర్స్ లో అలిగిన రెడ్డి గారు .. ఏమా కథ !!

భూమన కరుణాకర రెడ్డి..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత‌, చిత్తూరు జిల్లా తిరుపతి ఎమ్మెల్యే. అంతేకాకుండా వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ కుటుంబానికి అత్యంత ఆత్మీయుడు.

దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి రాజ‌కీయాల్లో క్రియ‌శీలంగా వ్య‌వ‌హ‌రించిన కాలం నుంచి భూమన కరుణాకర రెడ్డి ఆ కుటుంబానికి స‌న్నిహితుడు. అయితే, ఆయ‌న తాజాగా ఊహించ‌ని వార్త‌ల‌తో తెర‌మీద‌కు వ‌చ్చారు.

అప్పుడే భూమ‌న‌లో మొద‌లైందా?

ఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన స‌మ‌యంలో 25 మంది మంత్రులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం ఏర్పాటైంది. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ వీరందరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రివర్గ కూర్పులో సీఎం జగన్ తనదైన ముద్రను వేశారు. సామాజిక సమతూకాన్ని పాటిస్తూ అన్ని వర్గాలకూ కేబినెట్‌లో చోటు కల్పించారు. శాఖల కేటాయింపుల్లోనూ తన ప్రత్యేకతను చాటారు. అయితే, ఇందులో భూమన కరుణాకర రెడ్డికి చోటు దక్కకపోవడం గమనార్హం. అలా, భూమ‌న అసంతృప్తి వార్త‌ల్లోకి ఎక్కింది.

భూ అక్రమాలు బాధించాయా?

మ‌రోవైపు, వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఏదో ప‌రిణామాల‌తో వార్త‌ల్లోకి ఎక్కుతున్నారు. తిరుపతిలో భూ అక్రమాలకు పాల్పడుతున్న వారికి అంటూ తాజాగా ప్ర‌క‌ట‌న చేశారు. ``వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి గానీ, ఎమ్మెల్యే పేరు చెప్పి గానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులము అని చెప్పి గానీ ఎవరైనా భూదందాలకూ, చెట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించను. అలాంటి అరాచక శక్తులను నిర్ధాక్షిణ్యంగా అణచివేస్తాను. పోలీసు వారు, అధికారులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా బహిరంగంగా కోరుతున్నాను. న్యాయం వైపు, బలహీనుల పక్షం నిలబడతాను తప్ప దౌర్జన్యకారులను, చట్ట వ్యతిరేకులను క్షమించే ప్రసక్తే లేదు.“మీ భూమన కరుణాకర రెడ్డి అంటూ తేల్చి చెప్పారు.

క‌రోనా స‌మ‌యంలో ఎందుకిలా?

మ‌రోవైపు, కరోనాపై యుద్ధంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నిరంతరం ప్రజలకు అవగాహన కలిగిస్తూ.. ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా తమ ప్రాణాలకు తెగించి నగరంలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ.. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. ఇందులో భాగంగా స్వయంగా చెత్త సేకరణ రిక్షా తొక్కుతూ.. వారిలో స్ఫూర్తి నింపారు. అనంతరం ఆయన ప్రధాన కూడళ్లకు వెళ్లి ప్రజలకు కరోనా తీవ్రతను వివరించారు. అనంత‌రం, చిత్తూరులోని ఆస్ప‌త్రుల్లో క‌రోనాతో మృతి చెందుతున్న‌వారి మృత‌దేహాల‌ను ద‌గ్గ‌రుండి మ‌రీ అంత్య‌క్రియ‌లు చేయిస్తున్నారు.

ఆ అవ‌కాశం దొర‌క‌నందుకే….

ఇలా భూమ‌న క్రియాశీలంగా ప‌ని చేయ‌డం వెనుక కారణం ఆయ‌న‌లో ఉన్న అసంతృప్తి అని అంటున్నారు. త‌మ పార్టీ కోసం, ప్ర‌భుత్వం కోసం ప‌ని చేయాల‌నే త‌ప‌న‌తో భూమ‌న ఉన్న‌ప్ప‌టికీ, ఆ అవ‌కాశం దొర‌క‌నందునే ఇలా త‌న మార్కు ప‌నితీరును కొన‌సాగిస్తున్నారని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

author avatar
sridhar

Related posts

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N