Tdp : పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాలలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు పితాని సత్యనారాయణ.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా రాణించిన పితాని, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత టిడిపి పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా రాణించడం జరిగింది. కానీ గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన పితాని.. తాజాగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ సైలెంట్ గా మరిపోవటమే కాక అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం జిల్లా రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇదిలా ఉంటే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సరైన గౌరవం ఇవ్వకపోవడం తోనే పితాని సత్యనారాయణ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు జిల్లా రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో పితాని సత్యనారాయణ వ్యవహారం టిడిపి పార్టీలో, ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు మంత్రిగా చక్రం తిప్పి ఇప్పుడు ఆయన సైలెంట్ అవ్వటం పట్ల రకరకాల వార్తలు వస్తున్నాయి.
అప్పట్లో ఆయన పార్టీ మారుతున్నట్లు అనేక వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఈఎస్ఐ స్కామ్ బయటపడిన క్రమంలో ఈ వార్తలు ఊపందుకున్నాయి. ఆ సమయంలో సొంత పార్టీ నుండి సపోర్టు లేదని పార్టీ మారాలని పితాని నిర్ణయాలు తీసుకుంటున్నట్లు మీడియా సర్కిల్స్ లో కూడా వార్తలు వచ్చాయి. దీంతో అందరూ అప్పుడే పితాని సత్యనారాయణ పార్టీ మారటం గ్యారెంటీ అని భావించారు. అటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు పితాని సత్యనారాయణ కి పోలిట్ బ్యూరో పదవి కట్టబెట్టడం జరిగింది. దీంతో వస్తున్న వార్తలకు పుల్ స్టాప్ పెట్టినట్టు అయింది. ఈ క్రమంలో పదవి ఇచ్చినా గానీ పార్టీ పెద్దలు నుండి సరైన గౌరవం దక్కటం లేదని పితాని అనుచర వర్గం ఆరోపిస్తోంది. పైగా పితాని కుమారుడి పెళ్లికి కూడా చంద్రబాబు రాకపోవటం పితానికి బాధ కలిగించినట్లు పార్టీలో టాక్. దీంతో పంచాయతీ ఎన్నికల్లో పార్టీ నేతలకు అందుబాటులో లేకుండా పితాని సైలెంట్ అవ్వటం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.