నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. కాగా గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ విషయంలో కాస్త కన్ఫ్యూజన్ క్రియేటయిన సంగతి తెలిసిందే. చాలా మంది టాప్ హీరోయిన్స్ పేర్లు పరిశీలించినప్పటికి ఒక పట్టాన ఎవరూ ఫైనల్ కాలేదు. ఒక దశలో మళ్ళీ బాలయ్య సినిమాలో నయనతార నే తీసుకోబోతున్నారన్న ప్రచారం కూడా జరిగింది.
అంతేకాదు ఈసారి బాలయ్య కి జంటగా బోయపాటి కొత్త అమ్మాయిని తీసుకోబోతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే మలయాళ సినిమాలతో పాటు తమిళంలోనూ మంచి క్రేజ్ ఉన్న ప్రయాగ మార్టిన్ ని ఎంచుకున్నారు. కాని ప్రయాగ మలయాళ సినిమాలతో బిజీగా ఉన్నందున బిబి 3 కి అనుకున్నట్టుగా డేట్స్ ఇవ్వలేకపోయిందట. కాగా ఆ ప్లేస్ లో సాయేషా సైగల్ ని ఫైనల్ చేశారు. కాని సాయేషా బాలయ్య పక్కన చిన్న పిల్లలా ఉందని కామెంట్స్ రావడంతో సాయేషా ని తప్పించారు. ఫైనల్ గా కంచె బ్యూటి ప్రగ్యా జైస్వాల్ ని ఎంచుకున్నారు.
తాజాగా ప్రగ్యా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న షెడ్యూల్ లో జాయిన్ అయింది. అయితే ప్రయాగ – సాయేషా ఈ సినిమా నుంచి తప్పుకుంది మంచిదే అయిందని చెప్పుకుంటున్నారట. అందుకు కారణం ఈ ఇద్దరు బాలయ్య కి సరైన జోడీ కాదన్న టాక్ వినిపించడమే. ఇక పూర్ణ ఇప్పటికే షూటింగ్ లో జాయిన్ అయిందట. ఒకవైపు పూర్ణ, ఒకవైపు ప్రగ్యా జైస్వాల్ బాలయ్య కి పర్ఫెక్ట్ అని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారట. ఇక ఈ సినిమాకి దాదాపు మోనార్క్ అన్న టైటిల్ ఫైనల్ అని త్వరలో ఈ టైటిల్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని సమాచారం.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!