ఆమె రాజకీయాల్లో రాకముందే మంచి ప్రాక్టీసు ఉన్న డాక్టర్ !మొన్నటి ఎన్నికల్లో వైసిపి టిక్కెట్ పొంది గుంటూరు జిల్లా తాడికొండ నుంచి ఘన విజయం సాధించారు. ఎమ్మెల్యేగా కూడా ఆమె రాణిస్తున్నారు.
అంతా బాగా ఉందనుకున్న సమయంలో ఒక్క వైసిపి కార్యకర్త బాంబు పేల్చాడు.ఆమె ఏకంగా తనకు ఎనభై లక్షల రూపాయల అప్పు వుందని సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు .ఈ విధంగా తాడికొండ వైసిపి ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి వివాదంలో చిక్కుకున్నారు.ఇదే ఇప్పుడు గుంటూరు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. వివరాల లోకి వెళితే తుళ్లూరు మండలం నెక్కల్లు గ్రామానికి చెందిన మేకల రవీంద్ర అనే వైసీపీ కార్యకర్త ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల సమయంలో ఉండవల్లి శ్రీదేవి తనను డబ్బు కావాలని అడిగితే ఇచ్చానని రవి వెల్లడించారు.
తన భర్త తనను మోసం చేశాడని, తన వద్ద ఎన్నికలు ఎదుర్కోవడానికి పైసా లేదని తనతో చెప్పుకుని ఉండవల్లి శ్రీదేవి వాపోయిందని, ఆమె కన్నీరు పెట్టుకోవడంతో చూడలేక తనకు తెలిసిన వాళ్ల వద్ద డబ్బు తీసుకుని ఆమెకు ఇచ్చానని రవి వివరించారు. ఇచ్చిన డబ్బు మొత్తం తిరిగి ఇవ్వమని అడిగితే ఇప్పటివరకు ఆమె ఇచ్చింది రూ.60 లక్షలు మాత్రమేనని అన్నారు. ఇంకా రూ.80 లక్షలు ఇవ్వాల్సి ఉండగా, బ్యాలెన్స్ ఇచ్చేది లేదని బెదిరిస్తున్నారని మేకల రవి తెలిపారు. ఈ విషయంలో తనకు సీఎం జగన్ న్యాయం చేయాలని, లేకపోతే రాజధాని ప్రాంతంలో జరిగే మొదటి వైసిపి కార్యకర్త ఆత్మహత్య తనదే అవుతుందని రవి మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు.వైసీపీ నేతలు మాత్రం మేకల రవి వాదనలను నమ్మడంలేదు.
కోట్లు అప్పు ఇచ్చే ఆర్థికస్థాయి రవికి లేదని, రవికి అంతపెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చేవారు కూడా ఎవరూ లేరని అంటున్నారు.ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగినప్పుడు కనీసం ఒక్కరైనా మధ్యవర్తి ఉండక పోతారా అని వారు ప్రశ్నిస్తున్నారు!రాతకోతలు ఉండకుండా ఉంటాయా అని నిలదీస్తున్నారు. కాగా డాక్టర్ శ్రీదేవి చాలా కాలంగా వైద్య వృత్తిలో మంచి ప్రాక్టీస్ కలిగి ఉండడం అందరికీ తెలుసు.ఎన్నికలకి అవసరమైన డబ్బు ఆమె దగ్గర లేదంటే నమ్మశక్యం కావడం లేదు.ఒకవేళ కాస్తోకూస్తో తగ్గినా ఆమెకున్న పరపతి మేరకు పెద్ద స్థాయిలోనే డబ్బు పుడుతుంది తప్ప మేకల రవి వంటి వారిని ఆమె అడిగే పరిస్థితి లేదని ఎమ్మెల్యే సన్నిహితులు చెబుతున్నారు.దీని వెనక కూడా ఏదో రాజకీయ కుట్ర ఉందని శ్రీదేవి వర్గీయులు అనుమానిస్తున్నారు. రాజధాని ప్రాంతానికి చెందిన మరో వైసిపి ప్రజాప్రతినిధి తో ఉండవల్లి శ్రీదేవికి విభేదాలు ఉండటం ఇక్కడ గమనార్హం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?