మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న భారీ చిత్రం ‘ఆచార్య’. చిరంజీవి కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతుండగా.. కొణిదెల ప్రొడక్షన్స్, మాట్నీ మూవీస్ బ్యానర్స్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ‘ఆచార్య’ ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు చిత్ర యూనిట్. సామాజిక అంశంతో పాటు మంచి సందేశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాని 2021 సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరంజీవి. ఒకటి మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ కాగా… ఈ సినిమాకి వి.వి వినాయక్ దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం వినాయక్ చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టు కీలక మార్పులు చేస్తున్నాడట. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించిన అధికారక ప్రకటన అక్టోబర్ మొదటి వారంలో రానుందని సమాచారం. ప్రస్తుతం చేస్తున్న ఆచార్య కంప్లీట్ చేసి 2021 మార్చ్ నుంచి వి.వి వినాయక్ తో లూసిఫర్ తెలుగు రీమేక్ కోసం సెట్స్ మీదకి వెళ్ళనుందని అంటున్నారు.
కాగా మెహర్ రమేష్ సినిమాలో నటించబోతున్నట్టు తాజాగా పవన్ కళ్యాణ్ కన్ఫర్మ్ చేశారు. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం తెలుగు రీమేక్ కి మెహర్ రమేష్ ప్రీ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉన్నాడట. అయితే తాజాగా మెగాస్టార్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముందెన్నడు లేని విధంగా గుండుతో హాలీవుడ్ లుక్ లో దర్శనమిచ్చారు. అయితే ఇది ప్రస్తుతం చిరు కమిటయిన ఒక సినిమాకోసం అని సమాచారం. మొత్తానికి చిరు వేసిన స్కెచ్ మామూలుగా లేదని మెగా ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.