ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు నిర్వహించాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు సోమవారం బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులు సభ జరిగేది అనే దాని విషయంలో క్లారిటీ రానుంది. ప్రతిపక్ష పార్టీ టీడీపీ మాత్రం కచ్చితంగా 10 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరగాలని డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉండగా అసెంబ్లీలోకి మీడియా అనుమతి నిరాకరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్ష పార్టీ టిడిపి మీడియాని అసెంబ్లీలోకి అనుమతించాలని డిమాండ్ చేస్తోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఈ విషయంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని కి లెటర్ రాశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో మీడియా పాయింట్ ని తీసివేస్తూ వైసీపీ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో కనిపిస్తుంది.
ప్రజాస్వామ్యంలో మీడియా గొంతు నొక్కడం దారుణమని అప్రజాస్వామికమని మండిపడుతోంది.తాజాగా వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో జీవోనంబర్ 2430 ద్వారా మీడియా హక్కులను కాలరాసే విధంగా నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే శిక్షించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాజాగా ఈ జీవో పై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇలాంటి జీవోలను జాతీయ మీడియా తీవ్రంగా వ్యతిరేకించింది అని పేర్కొంటుంది. తెలుగు రాజకీయాలలో అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం తెలుగుదేశం పార్టీ హయాంలో 1998లో ప్రారంభమయ్యాయి. ఈ విధానాన్ని దేశంలో చాలా రాష్ట్రాలు అనుసరించడం జరిగాయి. ఇలాంటి తరుణంలో ఒక్కసారిగా అసెంబ్లీ ప్రాంగణములో మీడియాను అనుమతించకుండా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ, గతంలో మాదిరిగా మీడియాని అనుమతించాలని మండలి చైర్మన్ షరీఫ్ కు టిడిపి లెటర్ రాసింది.