ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రం ‘ఆచార్య’. చిరంజీవి కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతుండగా.. కొణిదెల ప్రొడక్షన్స్, మాట్నీ మూవీస్ బ్యానర్స్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ‘ఆచార్య’ ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు చిత్ర యూనిట్. సామాజిక అంశంతో పాటు మంచి సందేశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాని 2021 సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు.
ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మెగాస్టార్. అందులో ఒకటి మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్. ఈ సినిమాకి వి.వి వినాయక్ దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం వినాయక్ చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టు కీలక మార్పులు చేస్తున్నాడట. అలాగే మెహర్ రమేష్ సినిమాలో నటించబోతున్నాడు.
తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం రీమేక్ లో మెగాస్టార్ నటించబోతుండగా ఈ సినిమా కి మెహర్ రమేష్ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేస్తూ బిజీగా ఉన్నాడట. అయితే తాజా సమాచారం ప్రకారం చిరు – మెహర్ రమేష్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకోసమే రెండు వారాల క్రితం గుండు బాస్ లుక్ లో కనిపించారని మెగా అభిమానులు, ప్రేక్షకులు ఈ లుక్ లో మెగాస్టార్ ని చూసి ఎలా రియాక్ట్ అవుతారో తెలుసుకుందామనే మేకోవర్ చేసుకున్నారని తాజా సమాచారం.
అయితే మెగాస్టార్ ని అలా చూడటానికి కొంతమంది ఆసక్తిగా ఉంటే కొంతమంది మాత్రం గుండు లుక్ లో వద్దన్నట్టుగానే మాట్లాడుకుంటున్నారట. మరి వేదాళం సినిమాకోసం చిరు ఎలా మేకోవర్ అవుతారో చూడాలి.